వరసిద్ధుడి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2023-08-15T00:57:49+05:30 IST

కాణిపాక వరసిద్ధుడిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజాత సోమవారం దర్శించుకున్నారు.

వరసిద్ధుడి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్‌ సుజాతకు జ్ఞాపికను అందిస్తున్న ఈవో వెంకటేశు

ఐరాల(కాణిపాకం), ఆగస్టు 14: కాణిపాక వరసిద్ధుడిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజాత సోమవారం దర్శించుకున్నారు. వీరిని చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి, స్వామి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనానంతరం వేదాశీర్వద మండపంలో వారిని వేదమంత్రాలతో ఆశీర్వదించి, స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందించారు. చిత్తూరు డీఎ్‌ఫవో చైతన్యకుమార్‌రెడ్డి కూడా స్వామి సేవలో పాల్గొన్నారు. ఏఈవో ఎస్వీ కృష్ణారెడ్డి, సీఐ రవిశంకర్‌, సూపరింటెండెంట్‌ రంగస్వామి, కాణిపాకం ఎస్‌ఐ శ్రీనివాస్‌, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-15T00:57:49+05:30 IST