CM Jagan: 19న సిక్కోలుకు జగన్‌

ABN , First Publish Date - 2023-04-08T21:35:25+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌‌రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) ఈనెల 19న శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. టెక్కలి నియోజకవర్గం

CM Jagan: 19న సిక్కోలుకు జగన్‌

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి జగన్మోహన్‌‌రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) ఈనెల 19న శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. టెక్కలి నియోజకవర్గం (Tekkali Constituency)లో మూలపేట వద్ద.. భావనపాడు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. శనివారం మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు (Appalaraju) జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పోర్టు నిర్మాణం జరిగితే సెజ్‌ మాదిరిగా ఇక్కడే ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. అలాగే హిరమండలంలో ఎత్తిపోతల పథకం, ఆమదాలవలస నియోజకవర్గంలో బలసలరేవు వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. జిల్లాను ప్రగతిపథంలో తీసుకువెళ్లడంతో వైసీపీ ప్రభుత్వంలో ప్రధానపాత్ర పోషించిందని తెలిపారు.

Updated Date - 2023-04-08T21:35:25+05:30 IST