దైవశక్తితో సుఖ సంతోషాలు

ABN , First Publish Date - 2023-01-27T01:17:48+05:30 IST

దైవశక్తితోనే ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామిజీ అన్నారు.

దైవశక్తితో సుఖ సంతోషాలు
మాట్లాడుతున్న చిన్నజీయరు స్వామి

ఓర్వకల్లు, జనవరి 26: దైవశక్తితోనే ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామిజీ అన్నారు. గురువారం మండలంలోని తిప్పాయపల్లె గ్రామంలో శ్రీలత, రామమోహన్‌ రెడ్డి దంపతుల దాతృత్వంతో వెంకటేశ్వరస్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఇందులో రామానుజ జీయరుస్వామితో పాటు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ స్వామీజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావం పెంచుకోవాలని అన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అన్నదానం చేశారు. ఐఏఎస్‌ అధికారి మురళీధర్‌ రెడ్డి, మాజీ కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-27T01:17:49+05:30 IST