BJP MP Lakshman : రజాకార్ల పాలనను కళ్లకు కట్టేలా ‘‘రజాకార్’’

ABN , First Publish Date - 2023-08-11T19:01:06+05:30 IST

రజాకార్ల పాలన(rule of the Rajakars)ను కళ్లకు కట్టేలా సినిమా తీస్తున్న ‘‘రజాకార్’’ సినిమా బృందాన్ని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్(BJP MP Lakshman) అభినందించారు.

BJP MP Lakshman : రజాకార్ల పాలనను కళ్లకు కట్టేలా ‘‘రజాకార్’’

ఢిల్లీ(Delhi): రజాకార్ల పాలన(rule of the Rajakars)ను కళ్లకు కట్టేలా సినిమా తీస్తున్న ‘‘రజాకార్’’ సినిమా బృందాన్ని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్(BJP MP Lakshman) అభినందించారు. శుక్రవారం నాడు తెలంగాణ బీజేపీ నాయకులు తూళ్ల వీరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, దేశభక్తుడు బత్తిని మొగిలయ్య గౌడ్ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ , బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ,తెలంగాణ బీజేపీ నాయకులు తుళ్ల వీరేందర్‌గౌడ్, అలే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. గత పాలకులు ఎంతోమంది సమరయోధుల చరిత్ర తెలియకుండా చేశారన్నారు.దేశంలో నెహ్రు కుటుంబం, తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ చరిత్రే చరిత్ర అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మజ్లిస్ ఒత్తిడికీ లోబడి నిజాంకి వ్యతిరేకంగా పోరాడినవారి చరిత్ర మరుగున పడేలా చేశారని మండిపడ్డారు.నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన బత్తిని మొగులయ్యకు ఢిల్లీలో ఘన నివాళి అర్పించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మరుగునపడిన ఇలాంటి యోధుల విగ్రహాలు పెట్టడమే కాదు, త్యాగాలను స్మరిస్తూ.... వారి కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పారు. సమాజానికి వన్నె తెచ్చిన వారికి బీజేపీ సరైన గుర్తింపు ఇస్తుందని లక్ష్మణ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-08-11T19:19:38+05:30 IST