Share News

ఢిల్లీకి చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ..!

ABN , Publish Date - Jul 16 , 2024 | 07:02 AM

ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు వారాల వ్యవధిలో మరోసారి ఆయన ఢిల్లీకి వెళుతుండటం గమనార్హం. హోంమంత్రి అమిత్‌షాతో పాటు ఇతర నేతలను కలిసే అవకాశం ఉంది.

ఢిల్లీకి చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ..!

అమరావతి: ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు వారాల వ్యవధిలో మరోసారి ఆయన ఢిల్లీకి వెళుతుండటం గమనార్హం. హోంమంత్రి అమిత్‌షాతో పాటు ఇతర నేతలను కలిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిసి.. విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశం ఉంది. ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎవర్నీ వదలం

Read more AP News and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 07:02 AM