Share News

Lanka Dinakar: వైసీపీ నేతల్లో ఓటమి అనే నైరాశ్యం నిండిపోయి రెచ్చిపోతున్నారు

ABN , Publish Date - May 11 , 2024 | 12:48 PM

ఏపీలో వైసీపీ ఓటమి ఖాయమైపోయిందని.. ఈ విషయం అర్థమైన వైసీపీ నేతలు రాష్ట్రంలో వివాదాలు సృష్టించాలని కుట్ర చేస్తున్నారని బీజేపీ ప్రత్యేక అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓటర్లను, ప్రతిపక్ష పార్టీల నేతలను బెదిరిస్తున్నారన్నారు. ప్రజలను పచ్చి బూతులు తిడుతూ.. ఓటు తనకే వేయాలని బెదిరిస్తున్నారన్నారు.

Lanka Dinakar: వైసీపీ నేతల్లో ఓటమి అనే నైరాశ్యం నిండిపోయి రెచ్చిపోతున్నారు
Lanka Dinakar

విజయవాడ: ఏపీలో వైసీపీ (YSRCP) ఓటమి ఖాయమైపోయిందని.. ఈ విషయం అర్థమైన వైసీపీ నేతలు రాష్ట్రంలో వివాదాలు సృష్టించాలని కుట్ర చేస్తున్నారని బీజేపీ ప్రత్యేక అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓటర్లను, ప్రతిపక్ష పార్టీల నేతలను బెదిరిస్తున్నారన్నారు. ప్రజలను పచ్చి బూతులు తిడుతూ.. ఓటు తనకే వేయాలని బెదిరిస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను అసభ్య పదజాలంతో బూతులు తిడుతున్నారన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నామని.. దీనిపై చర్యలు తీసుకోవాలని లంకా దినకర్ డిమాండ్ చేశారు. బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసే వారిపై దాడులు చేసి కొడుతున్నారన్నారు. చెప్పలేని విధంగా బూతులు తిడుతూ భయ పెడుతున్నారని లంకా దినకర్ అన్నారు.

AP Elections: ఓట్ ఫర్ చేంజ్ అంటున్న ఆంధ్రావాసులు.. టోల్‌ప్లాజాల వద్ద వాహనాల వరద


‘‘290 బూత్ ఉంటే 248 బూత్ లలో వెబ్ క్యామ్‌లు పెట్టే పరిస్థితి తెచ్చారరు. అంటే ధర్మవరం నియోజకవర్గంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. వైసీపీ నేతల్లో ఓటమి అనే నైరాశ్యం నిండిపోయి... రెచ్చిపోతున్నారు. కత్తులు, గొడ్డళ్లు, బరిసెలతో బరి తెగించి.. ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేద్దామని చూస్తున్నారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు వైసీపీకి సమాధానం చెప్పారని జగన్‌కు అర్థమైంది. ఇలాగే పిచ్చిగా వాగితే.. వైసీపీ నేతలను ప్రజలే తరిమి కొట్టడం ఖాయం. ఈ ఐదేళ్లల్లో ప్రజలను భయపెట్టి బతికిన పార్టీ వైసీపీ. ప్రజలంతా మరోసారి ఆలోచన చేయండి.. ఇటువంటి బూతులు తిట్టే వాళ్లు చట్టసభల్లోకి అవసరమా? మీ ఆస్తులు, మీ స్థలాలు కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. అటువంటి వైసీపీ నేతలను రాజకీయాల్లోనే ఉండకుండా తరిమి కొట్టాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో కేతిరెడ్డి వంటి వాళ్లే దోపిడికి తెగ బడతారు. కేంద్రం ఆఫీసర్‌ను పెట్టమంటే.. ఎవరినైనా పెట్టవచ్చు అని జగన్ రూల్ మార్చాడు. అంటే ప్రైవేటు వ్యక్తులను పెట్టి మీ ఆస్తులు లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక గాలి వీస్తుంది .. తప్పకుండా వైసీపీ ఓటమి ఖాయం’’ అని లంకా దినకర్ అన్నారు.

ఇవి కూడా చదవండి...

Secunderabad: ఎన్ని కుట్రలు చేసినా నివేదిత విజయం ఖరారు

Lok Sabha Elections 2024: రెండు కోట్ల విలువ చేసే మద్యం పట్టివేత

Read Latest AP News And Telugu News

Updated Date - May 11 , 2024 | 12:48 PM