Share News

కౌంటింగ్‌లో ఆఖరు వరకూ ఉండాలి

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:24 AM

కౌంటింగ్‌ఏజెంట్లగా వెళ్లేవారంతా తప్పనిసరిగా జాగ్రత్త వహించి, ఆఖరు వరకూ ఉండాలని శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి కోరారు. శనివారం లక్క వరపుకోటలో ఈనెల నాలుగోతేదీన జరిగే కోళ్ల లలితకుమారి, ఎంపీభరత్‌ తరపున సార్వత్రిక ఎన్ని కల కౌంటింగ్‌ఏజెంట్లగా వెళ్లేవారికి పార్టీ సీనియర్‌నాయకుడు గొంప దుర్గాఉమేష్‌ శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా లలితకుమారి మాట్లాడుతూ ఏజెంట్లుగా వెళ్లేవారంతా తప్పనిసరిగా జాగ్రత్త వహిం చాలని, ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడినా రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయాలని కోరారు. కౌంటింగ్‌ ప్రక్రియలో ఎటువంటి సందేహం వచ్చినా ఆర్వోను సంప్రదించాలని తెలిపారు. ప్రతి ఒక్క రూ ఓపికతో సంయమనం పాటించాలని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఏజెంట్లకు ఆదివారం శిక్షణ జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 కౌంటింగ్‌లో ఆఖరు వరకూ ఉండాలి

లక్కవరపుకోట:కౌంటింగ్‌ఏజెంట్లగా వెళ్లేవారంతా తప్పనిసరిగా జాగ్రత్త వహించి, ఆఖరు వరకూ ఉండాలని శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి కోరారు. శనివారం లక్క వరపుకోటలో ఈనెల నాలుగోతేదీన జరిగే కోళ్ల లలితకుమారి, ఎంపీభరత్‌ తరపున సార్వత్రిక ఎన్ని కల కౌంటింగ్‌ఏజెంట్లగా వెళ్లేవారికి పార్టీ సీనియర్‌నాయకుడు గొంప దుర్గాఉమేష్‌ శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా లలితకుమారి మాట్లాడుతూ ఏజెంట్లుగా వెళ్లేవారంతా తప్పనిసరిగా జాగ్రత్త వహిం చాలని, ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడినా రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయాలని కోరారు. కౌంటింగ్‌ ప్రక్రియలో ఎటువంటి సందేహం వచ్చినా ఆర్వోను సంప్రదించాలని తెలిపారు. ప్రతి ఒక్క రూ ఓపికతో సంయమనం పాటించాలని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఏజెంట్లకు ఆదివారం శిక్షణ జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పారితోషికం తక్షణమే చెల్లించండి

ఫ చీపురుపల్లిలో ఎన్నికల రూట్‌ అధికారుల నిరసన

చీపురుపల్లి: తక్షణమే పారితోషికం చెల్లించాలని ఎన్నికల రూట్‌ కోరారు. ఈమేరకు శనివారం చీపురుపల్లి తహసీల్దారు కార్యాలయం ఎదుట రూట్‌ ఆఫీస ర్లుగా విధులు నిర్వహించిన వెలుగు అధికారులు నిరసనతెలిపారు.ఈ సందర్భం గా మాట్లాడుతూ ఎన్నికల్లో తమ సేవలుఉపయోగించుకొని పారితోషికం చెల్లిం చకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారనివాపోయారు. ఎన్నికల సమ యంలో తామంతా 14 రోజులపాటు విధులు నిర్వహించామని తెలిపారు. రెగ్యు లర్‌గా 33మంది, రిజర్వ్‌విధుల్లో ఇద్దరు పనిచేశామని చెప్పారు.ఇంతవరకూ తమకు ఒక్కపైసా కూడా చెల్లించలేదని తెలిపారు. తమకు రావాల్సిన పారితోషి కం గురించి ఎన్నిసార్లు అడిగినా, ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ విషయంపై తహసీల్దారు, ఆర్వోలు దాటవేస్తున్నారని ఆరోపించారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్‌ స్పందించాలని కోరారు.

Updated Date - Jun 02 , 2024 | 12:24 AM