Share News

Festival Time : హరియాలీ తీజ్ వేడుకల్లో ఖీర్ ఎందుకు చేస్తారు?

ABN , Publish Date - Aug 07 , 2024 | 03:00 PM

హరియాలీ తీజ్ మహిళలు జరుపుకునే సాంప్రదాయ పండుగ. ఈ రోజున వివాహం అయిన స్త్రీలు భర్త ఆరోగ్యం కోసం పూజలు చేస్తారు. ఉదయం నుంచి ఉపవాసం దీక్షలో నీరు కూడా తాగకుండా సాయంత్రం వరకూ ఉంటారు.

Festival Time : హరియాలీ తీజ్ వేడుకల్లో ఖీర్ ఎందుకు చేస్తారు?
Health Benefits

శ్రావణమాసం మొదలుకాగానే వచ్చే పండుక శ్రావణ్ తీజ్ లేదా హరియాలీ తీజ్ అని పిలుస్తారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జరుపుకునే పండుగల్లో ప్రధాన పండుగ ఇది. పురాణాల ప్రకారం పార్వతిదేవి భక్తితో శివుడి భార్యగా రావడాన్ని హరియాలీ తీజ్ పేరుతో వివాహం అయిన స్త్రీలు జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ పండుగ భారతదేశంలో పంజాబ్, యుపి, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో చాలా గొప్ప చేస్తారు. ఈ పండుగ చేసుకోవడం వల్ల వైవాహిత జీవితంలో ఆనందం, సంతానోత్పత్తి కలుగుతాయని నమ్ముతారు. వానలు సరిగా పడి పంటలు పండేందుకు అమ్మవారి కృప ఉంటుందనే నమ్మకం కూడా ఉంది.

కొన్ని చోట్ల పెళ్ళికాని అమ్మాయిలు కూడా ఈ వేడుకను చేస్తారు. వివాహానికి దగ్గరలో ఉన్నట్లయితే ప్రేమించే భర్త రావాలని, తల్లిదండ్రుల ఆశీస్సులు పొందుతారు.

హరియాలీ తీజ్ ఎలా జరుపుకుంటారు.

హరియాలీ తీజ్ మహిళలు జరుపుకునే సాంప్రదాయ పండుగ. ఈ రోజున వివాహం అయిన స్త్రీలు భర్త ఆరోగ్యం కోసం పూజలు చేస్తారు. ఉదయం నుంచి ఉపవాసం దీక్షలో నీరు కూడా తాగకుండా సాయంత్రం వరకూ ఉంటారు. భర్త శ్రేయస్సు, సంసార జీవితం బావుండాలని ఈ ఉపవాస నియమాన్ని కఠినంగా పాటిస్తారు.


Health Tips : తల్లిపాలతో బిడ్డకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి..!

హరియాలీ తీజ్ వేడుకలో భాగంగా సాయంత్రం వేళ మహిళలు, పిల్లలు ఊయల ఊగుతారు. చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత ఆనందంగా భర్తతో జీవితం ఉంటుందని పార్వతీదేవి చెప్పినట్టుగా నమ్ముతారు.

అమ్మవారి ఆరాధనకు స్త్రీలు కొత్త దుస్తుల్లో ముస్తాబు అవుతారు. శివపార్వతులను పూజిస్తారు. కలకండ్, స్వీట్లు, ఖీర్ తయారుచేసుకుని తింటారు. ఖీర్ హరియాలీ తీజ్ రోజున ప్రత్యేకంగా తయారుచేసే వంటకం.


Health Tips : స్ట్రెస్‌లాక్సింగ్ అంటే ఏమిటి? విశ్రాంతి తీసుకోవాలన్నా ఒత్తిడికి గురవుతున్నామా..!

వెర్మిసెల్లి ఖీర్ చేసే విధానం..

వెర్మిసెల్లిని నెతిలో వేయించాలి. కాస్త ఎర్రటి రంగు వచ్చే వరకూ వేయించి తీయాలి. ఇలా చేయడం వల్ల రుచి పెరుగుతుంది.

పాన్ పెట్టి పాలను పోసి మరిగించాలి. పాలు బాగా మరిగిన తర్వాత వేయించిన వెర్మిసెల్లిని వేసి ఉడికించాలి. ఇది కాసేపు ఉడికిన తర్వాత పంచదారను వేసి కలపాలి. బాగా ఉడికిన మిశ్రమంలో యాలకుల పొడిని కలిపాలి. వేయించిన బాదం, జీడిపప్పు, కిస్ మిస్, పిస్తా వేయడం వల్ల మంచి రుచి వస్తుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Aug 07 , 2024 | 03:05 PM