శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు
ABN , Publish Date - Mar 26 , 2025 | 05:18 AM
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు అధికంగా పాల్గొంటున్నారు.

చెట్టూ పుట్టా చుట్టేసి.. కొండా కోనా దాటేసి.. పోదాం మల్లన్న సన్నిధికి!
శ్రీశైలం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): అడుగులన్నీ మల్లన్న సన్నిధికే. ఆశలన్నీ తల్లి భ్రమరాంబవారిపైనే. అమ్మవారిని తమ ఆడబిడ్డగా భావించి సేవించే కన్నడిగులు కర్ణాటక ప్రాంతం నుంచి శ్రీశైలానికి తరలివస్తున్నారు. దీంతో శ్రీగిరి సందడిగా మారింది. శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 27న స్వామివారి యాగశాల ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు.. 31న ముగుస్తాయి.కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం నాటికే వేలాది మంది స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారంతో స్పర్శ దర్శనం నిలిపివేసి.. గురువారం నుంచి అలంకరణ దర్శనం మాత్రమే కల్పించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ