Share News

Kejriwal: ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్ర..!!

ABN , Publish Date - May 12 , 2024 | 01:24 PM

భారతీయ జనతా పార్టీపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌‌లో తమ ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మీద విడుదలయిన సంగతి తెలిసింది. ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్‌ను కలిశారు.

Kejriwal: ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్ర..!!
kejriwal

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీపై (BJP) ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌‌లో తమ ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మీద విడుదలయిన సంగతి తెలిసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఈ రోజు కేజ్రీవాల్‌ను కలిశారు.


‘తన అరెస్ట్ తర్వాత పార్టీ మరింత బలోపేతం అయ్యింది. పార్టీని చీల్చాలనే బీజేపీ కుట్ర విఫలమైంది. ఆ సమయంలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించింది. మీరు మాత్రం పార్టీ పట్ల, తన పట్ల విధేయతతో ఉన్నారు. ఆ సందర్భాన్ని చూసి యావత్ దేశం గర్వ పడింది. దేశానికి మంచి భవిష్యత్ ఇవ్వడం ఆప్ వల్లే సాధ్యం అవుతుంది. పంజాబ్, ఢిల్లీలో తమ ప్రభుత్వం చేసిన పనుల గురించి యావత్ ప్రపంచం మాట్లాడుతుంది అని’ అరవింద్ కేజ్రీవాల్ తనను కలిసిన ఎమ్మెల్యేలతో అన్నారు.


Read Latest Telangana News and National News


Updated Date - May 12 , 2024 | 01:24 PM