Share News

Health Tips : తిన్న తర్వాత విషంగా మారే ఆహారపదార్ధాలు ఇవే..

ABN , Publish Date - Jul 31 , 2024 | 11:57 AM

తిన్న ఆహారంలో ఏది ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో సరిగా తెలియక తికమక పడుతుంటాం. అయితే మనం తీసుకుంటున్న ఆహారంలో ఏవి సరైనవి.

Health Tips : తిన్న తర్వాత విషంగా మారే ఆహారపదార్ధాలు ఇవే..
Health

తరచుగా మనం తినే ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, వికారం, వాంతులు వంటి ఇబ్బందులను కలిగిస్తూ ఉంటుంది. తిన్న ఆహారంలో ఏది ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో సరిగా తెలియక తికమక పడుతుంటాం. అయితే మనం తీసుకుంటున్న ఆహారంలో ఏవి సరైనవి. ఆరోగ్యానికి మేలు చేసేవి ఏవి.. ఇబ్బందికి గురిచేసేవి ఏ పదార్థాలు అనేది తెలుసుకోవడం ముఖ్యం.

చెర్రీస్..

ఎర్రగా చూసేందుకు అందంగా కనిపించే చెర్రీస్ రుచిలో పుల్లగా ఉంటాయి. ఇందులోని గింజలు గట్టిగా ఉండి లోపల ఉండే పదార్థం సైనైడ్‌లా పనిచేస్తుంది. పొరపాటున వాటిని తిన్నట్లయితే ఇది విషపూరితంగా మారే అవకాశం ఉంది. చెర్రీస్ తినేప్పుడు అందులోని గింజల్ని తినకూడదు.

యాపిల్ విత్తనాలు..

యాపిల్ తినేప్పుడు పొరపాటుగా ఒకటి రెండు గింజలు తింటే పర్వాలేదు కానీ మొత్తంగా కాస్త ఎక్కువ మోతాదులో తీసుకుంటే కనుక యాపిల్ గింజల్లో సైనైడ్ ఉంటుంది. ఇది శ్వాస ఆడకుండా చేస్తుంది. మూర్చ రావచ్చు, పరిస్థితి విషమిస్తే మరణానికి కూడా దారితీస్తుంది.

Health Tips : కాల్చిన అల్లం, తేనెతో జలుబు, గొంతు నొప్పికి చెక్ పెట్టండిలా... !

ఎల్డర్బెర్రీస్..

రోగనిరోధక శక్తిని పెంచడానికి జలుబు, ఫ్లూ లక్షణాలు, మలబద్ధకాన్ని తగ్గించాలంటే ఎల్డర్ బెర్రీని సిరప్, లేదా సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. కానీ ఈ పండ్లను, ఈ చెట్టు బెరడు, ఆకులు వీటిలో ఏవి తిన్నాకూడా ఇందులో లెక్టిన్, సైనైడ్ రెండు రసాయనాలున్నాయి. వీటి కారణంగా వికారం, వాంతులు, విరేచనాలు అవుతాయి.

జాజికాయ..

మనం మసాలా దినుసుగా వాడే జాజికాయ కొద్ది పరిమాణంలో వాడితే ఏం కాదు కానీ అదే స్పూనుకు మించి తీసుకుంటే భ్రాంతులు, మగత, మైకము, గందరగోళం, మూర్చ వచ్చే ప్రమాదం ఉంది. ఇందులోని మిరిస్టిసిన్ అనే నూనె కారణంగా రెండు స్పూన్ల మొత్తంలో తీసుకుంటే శరీరానికి విషపూరితం కావచ్చు.


Women With Diabetes : మధుమేహం ఉన్న స్త్రీలలో అధికంగా కనిపించే సంకేతాలు ఇవే..

ఆకుపచ్చ బంగాళదుంపలు..

బంగాళదుంపలు భూమిలో పండుతాయి. ఇందులో గ్లైకోఅల్కలాయిడ్ అనే విషపదార్థం ఉంటుంది. బంగాళాదుంప కాంతికి గరైనప్పుడు, పాడైపోయినపుడు ఇవి ఆకుపచ్చగా మారుతాయి. దీనిని తింటే ఇందులోని అధిక గ్లైకోఅల్కలాయిడ్ కంటెంట్ వికారం, విరేచనాలు, గందరగోళం, తలనొప్పి, ఒక్కోసారి మరణం కూడా కలగవచ్చు.

కిడ్నీ బీన్స్..

అన్ని రకాల బీన్స్‌లో లెక్టిన్ అత్యధిక సాంద్రత కలిగి ఉంటాయి. పచ్చి కిడ్నీ బీన్స్ తీసుకోడం వల్ల వికారం, తలతిరుగుతున్నట్లుగా ఉంటుంది. అందుకే ఉడికించిన బీన్స్ మాత్రమే తీసుకోవాలి.


Health Tips : ఎయిర్ పాడ్స్ వాడితే బ్రెయిన్ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందా..!

స్టార్ ఫ్రూట్..

మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు ఆహారంలో స్టార్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మానసిక గందరగోళం, మూర్చలు, మరణానికి కారణం అవుతుంది.

పుట్టగొడుగులు..

అడవిలోని పుట్టగొడుగులు అన్నీ సురక్షితం కాదు. వీటిలో కొన్ని రకాలను తినడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్, తీవ్రమైన దాహం, కాలేయ వైఫల్యం, కోమా, ఒక్కోసారి మరణం కూడా జరగవచ్చు.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 31 , 2024 | 11:58 AM