AP Floods: రైతుల కోసం పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినూత్న నిరసన
ABN, Publish Date - Jul 24 , 2024 | 05:12 PM
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎడ తెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. భారీ వర్షాలతో నష్ట పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఆ క్రమంలో బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలంటూ.. నడుంలోతు నీళ్లలోకి దిగి తన వినూత్నం నిరసనను తెలిపారు.

నీట మునిగిన పంట పొలాల్లోకి వెళ్తున్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

నీట మునిగిన పంట పొలాల్లోకి వెళ్లి.. తన నిరసన తెలిపేందుకు సిద్దమవుతున్న షర్మిల

తన భద్రత సిబ్బందితో మాట్లాడుతున్న వైఎస్ షర్మిల

భారీ వర్షాలు, వరదలతో నీటి మునిగిన వరి కంకులను షర్మిలకు అందిస్తున్న రైతులు

వరి కంకులను పరిశీలించి.. రైతులతో మాట్లాడుతున్న షర్మిల

వరి కంకులు చేతపట్టి.. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న వైఎస్ షర్మిల

పంట పొలాలు ఎంత మేర నీటి మునిగి పోయాయో.. మీడియాకు చూపిస్తున్న షర్మిల

పంట నీట మునగడంతో.. రైతులకు నష్ట పరిహారం అందించాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేేస్తున్న వైఎస్ షర్మిల

మీడియా ప్రశ్నలను సావదానంగా వింటున్న వైఎస్ షర్మిల
Updated at - Jul 26 , 2024 | 11:12 AM