Iftar Party: విజయవాడలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Mar 27 , 2025 | 09:19 PM
రంజాన్ మాసం సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందును గురువారం నాడు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి ఎన్ ఎండీ ఫరూఖ్, ఎమ్మెల్యేలు, ముస్లిం మత పెద్దలు, ముస్లింవర్గ ప్రజలు పాల్గొన్నారు.

రంజాన్ మాసం సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందును గురువారం నాడు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్, ఎమ్మెల్యేలు, ముస్లిం మత పెద్దలు, ముస్లింవర్గ ప్రజలు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబును కలిసేందుకు ముస్లిం సోదరులు పోటీ పడ్డారు.

సీఎం చంద్రబాబుతో సెల్ఫీలు దిగేందుకు ముస్లిం సోదరులు ఉత్సాహం చూపించారు.

ప్రతి ఒక్కరినీ అప్యాయంగా పలకరించి.. వారితో కలిసి సీఎం చంద్రబాబు ఫొటోలు దిగారు.

లోపల ఆడిటోరియం నుంచి బయట ప్రధాన ద్వారం వరకు నడుస్తూనే ముస్లిం సోదరులు ఫొటోలు తీసుకునే వరకు సీఎం చంద్రబాబు ఓపిగ్గా ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

కార్యక్రమంలో నమాజ్ చేస్తున్న ముస్లిం సోదరులు

ముస్లింలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నమాజ్ చేశారు.

రంజాన్ పవిత్ర మాసంలో అందరూ కఠినమైన ఆచారాలను పాటిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు.

సలామాలేకూమ్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు. ఉదయం నుంచి ఖురాన్ చదవడం, ఇతరులకు సహాయం చేయడం వంటి మంచి పనులను ముస్లిం సోదరులు చేస్తున్నారని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

పాజిటీవ్ ఆలోచనలతో.. అందరూ బాగుండాలని ముస్లిం సోదరులు పని చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

నేడు ఖురాన్ నేర్పించిన మంచి గుణం.. డబ్బులున్నవాళ్లు పేదలకు సాయం చేయడమేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు అండగా ఉందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

మైనార్టీల సంక్షేమం కోసం చాలా పథకాలను అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.

నూటికి నూరుశాతం పేదలను పైకి తీసుకొచ్చేందుకే పీ4 కార్యచరణను ఈనెల 30వ తేదీన చేపడుతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

పేదరికంలో ఉన్న ప్రతీ ముస్లిం కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చి తీరుతామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడతామని సీఎం చంద్రబాబు చెప్పారు. మత సామరస్యాన్ని కాపాడుతూ మైనార్టీలకు అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ఉర్థూని రెండో భాషగా గుర్తించటంతో పాటు వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతూ వచ్చామని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.

హైదరాబాద్, కర్నూల్లో ఉర్ధూ విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

అనంతరం ఉండవల్లిలోని తన నివాసానికి సీఎం చంద్రబాబు బయలుదేరి వెళ్లారు.
Updated at - Mar 27 , 2025 | 10:18 PM