Share News

CM Revanth: ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కేడర్‌కు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ABN , Publish Date - May 22 , 2024 | 09:19 PM

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికపై బుధవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు.

CM Revanth: ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కేడర్‌కు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
CM Revanth Reddy

హైదరాబాద్: నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికపై బుధవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు.


ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని రేవంత్‌రెడ్డి సూచించారు. మూడు ఉమ్మడి జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్‌చార్జ్‌లు ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేయాలని ఆదేశించారు. ఈనెల 27న పోలింగ్ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు, నాయకులను సన్నద్ధం చేయాలన్నారు. ప్రతీ ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌లను సందర్శించాలని కోరారు.


నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పని చేస్తారని తెలిపారు.సమస్యల పరిష్కారానికి తీన్మార్ మల్లన్న గెలుపు ఉపయోగపడుతుందని చెప్పారు. ఇది తీన్మార్ మల్లన్న ఎన్నిక మాత్రమే కాదని.. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక అని చెప్పారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫ్యాన్‌ పార్టీకి సీఈసీ చెక్‌..

అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే పిన్నెల్లి..

అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..

బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..

జగన్‌ సర్కార్‌ మరో కుట్ర

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 22 , 2024 | 09:50 PM