Share News

KCR: నేటితో ముగియనున్న కేసీఆర్ బస్సు యాత్ర

ABN , Publish Date - May 10 , 2024 | 08:59 AM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర నేటితో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రి 7గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభ జరగనుంది. సిద్దిపేట సభతో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది. ఏప్రిల్ 24న మిర్యాలగూడ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచార బస్సు యాత్ర ప్రారంభమైంది

KCR: నేటితో ముగియనున్న కేసీఆర్ బస్సు యాత్ర

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) బస్సు యాత్ర నేటితో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రి 7గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభ జరగనుంది. సిద్దిపేట సభతో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది. ఏప్రిల్ 24న మిర్యాలగూడ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచార బస్సు యాత్ర ప్రారంభమైంది. 16 రోజులు 13 లోక్‌సభ నియోజక వర్గాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్‌ను కేసీఆర్ నిర్వహించారు. ఎన్నికల సంఘం నిషేధం కారణంగా 48గంటలు కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది. మే1న రాత్రి 8గంటల నుంచి 3న రాత్రి 8గంటల వరకూ ఈసీ నిషేధం విధించింది. నిషేధం గడువు ముగిసిన అనంతరం యథావిధిగా కొనసాగిన కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి..

Hyd News: మద్యం ప్రియులకు కీలక అప్‌డేట్.. రేపటి నుంచి..

AP Election 2024: వైసీపీ కోసం.. లూప్‌లైన్‌ ‘వ్యూహం’

Read more Telangana News and Telugu News

Updated Date - May 10 , 2024 | 08:59 AM