Share News

Car Accident: పాలడుగు వద్ద చెట్టును ఢీకొట్టిన కారు.. ఎంతమంది గాయపడ్డారంటే..?

ABN , Publish Date - Jun 09 , 2024 | 09:11 AM

వైరా (Wyra) మండలం పాలడుగు సమీపంలో కారు అదుపుతప్పి (Car Accident) చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి వాసులుగా గుర్తించారు.

Car Accident: పాలడుగు వద్ద చెట్టును ఢీకొట్టిన కారు.. ఎంతమంది గాయపడ్డారంటే..?

ఖమ్మం: వైరా (Wyra) మండలం పాలడుగు సమీపంలో కారు అదుపుతప్పి (Car Accident) చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి వాసులుగా గుర్తించారు. దాచేపల్లి నుంచి పాల్వంచ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బాధితుల్ని 108అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనేది పూర్తి స్పష్టత లేదు. ఏదైనా వాహనం ఢీకొట్టిందా లేక కారు అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For more Telangana News and Telugu News..

Updated Date - Jun 09 , 2024 | 09:11 AM