Share News

Shamshabad : వ్యక్తిని ఢీకొన్న కారు.. అద్దం తగిలి వేరైన తల

ABN , Publish Date - Aug 07 , 2024 | 03:39 AM

ఆ వ్యక్తిది ఎంత దారుణమైన చావు! కారు ఢీకొట్టడంతో ఆ వ్యక్తి బానెట్‌పై పడి.. అద్దానికి (విండ్‌షీల్డ్‌) బలంగా తగిలాడు! ఆ వేగానికి కారు అద్దం పగిలిపోవడం.. కారులోకి చొచ్చుకెళ్లిన తల ఆ అద్దం పదునుకు శరీరం నుంచి వేరై కారులోపల పడటం.. క్షణాల్లో జరిగిపోయాయి.

Shamshabad : వ్యక్తిని ఢీకొన్న కారు.. అద్దం తగిలి వేరైన తల

  • ఓఆర్‌ఆర్‌పై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఢీకొన్న కారు

  • నేరుగా బానెట్‌పై పడి అద్దానికి బలంగా తగిలిన వ్యక్తి

  • అద్దం పగిలి దాని పదునుకు మొండెం నుంచి వేరై కారులో పడ్డ తల

శంషాబాద్‌ రూరల్‌, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ఆ వ్యక్తిది ఎంత దారుణమైన చావు! కారు ఢీకొట్టడంతో ఆ వ్యక్తి బానెట్‌పై పడి.. అద్దానికి (విండ్‌షీల్డ్‌) బలంగా తగిలాడు! ఆ వేగానికి కారు అద్దం పగిలిపోవడం.. కారులోకి చొచ్చుకెళ్లిన తల ఆ అద్దం పదునుకు శరీరం నుంచి వేరై కారులోపల పడటం.. క్షణాల్లో జరిగిపోయాయి.

ఈ ఘోర రోడ్డు ప్రమాదం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగింది. సీఐ నరేందర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఊట్‌పల్లికి చెందిన తొట్ల అంజయ్య అనే వ్యక్తి సోమవారం రాత్రి 9 గంటలకు ఓఆర్‌ఆర్‌పై నడుచుకుంటూ వెళ్తున్నాడు. గచ్చిబౌలి నుంచి తుక్కుగూడ వైపు వెళ్తున్న కారు అతడిని వెనుక నుంచి ఢీకొంది. అంజయ్య ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు.

కారు అద్దం పగిలి అంజయ్య మెడను కోసేసింది. తల తెగి కారులో పడింది. తీవ్ర ఆందోళనకుగురైన కారు డ్రైవర్‌ డయల్‌ 100కు ఫోన్‌ చేసి ప్రమాదం గురించి చెప్పాడు. పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని తల మొండాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అనంతరం మృతదేహన్ని కుటుంబీకులకు అప్పగించారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు స్పీడులో ఉండటం, వ్యక్తి బానెట్‌పై పడి అద్దం పగిలి మెడను కోసిందని సీఐ తెలిపారు. ఘటనపై కేసు నమోదైంది.

Updated Date - Aug 07 , 2024 | 03:39 AM