ముంబైలో భారీ వర్షాల.. రోడ్లు జలమయం..

ABN, Publish Date - Jul 08 , 2024 | 10:41 AM

ముంబయి: మహానగరం సముద్రంగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబై శివారు ప్రాంతాల్లోకుండపోత వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

ముంబయి: మహానగరం సముద్రంగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబై శివారు ప్రాంతాల్లోకుండపోత వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరద నీరు రోడ్ల మీద ప్రవహిస్తోంది. వీథులు, కాలనీలు అన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. మొకాలలోతు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబై మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు. రుతుపవనాలు విస్తరించడంతో మహారాష్ట్ర రాజధాని ముంబైలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో నేటినుంచి ఇసుక ఉచితం..

చంద్రబాబు సీఎం కావాలని మొక్కుకున్నాం: దేవేంద్ర

మృతుని కుటుంబసభ్యుల ఆందోళన..

నేడు విజయవాడ వెళ్లనున్న సీఎం రేవంత్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 08 , 2024 | 10:41 AM