తిరుమల కల్తీలో బయటపడుతున్న కొత్త ట్విస్టులు

ABN, Publish Date - Sep 26 , 2024 | 03:38 PM

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు శ్రీవారి ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి సరఫరా చేసే సంస్థ తిరుమలకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది.

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు శ్రీవారి ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి సరఫరా చేసే సంస్థ తిరుమలకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో నెయ్యి సరఫరా చేయాలంటే ఒక్కొ ట్యాంకర్‌కు దాదాపు 8 గంటల సమయం పడుతుంది.


కానీ 24 గంటల్లోనే ట్యాంకర్ రెండు ట్రిప్‌లు వేయడంపై భక్తుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదీకాక.. ఈ సారి వైష్ణవి పేరుతో ఏఆర్ ఫుడ్స్ సంస్థ నెయ్యి సరఫరా చేస్తుంది. దీంతో భక్తుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లడ్డూ ప్రసాదం కల్తీపై తాజాగా చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Updated at - Sep 26 , 2024 | 03:39 PM