ఏపీలో రేపే పోలింగ్.. కేంద్రాల వద్ద ఈసీ నిఘా
ABN, Publish Date - May 12 , 2024 | 08:35 AM
అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనుంది. నాలుగో దశలో నిర్వహిస్తున్న ఈ పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.
అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనుంది. నాలుగో దశలో నిర్వహిస్తున్న ఈ పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 4 కోట్ల 14 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. అన్ని అసెంబ్లీ సహా పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై నోరు పారేసుకున్న టీటీడీ చైర్మన్
చంద్రబాబు కొనసాగివుంటే.. అమరావతిది మరో చరిత్రే!
Pawan Kalyan : వైసీపీకి ఓటేయొద్దు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - May 12 , 2024 | 08:35 AM