Share News

Fire అటవీప్రాంతంలో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:40 AM

మద్దివారిగొంది, కటారుపల్లి, తుమ్మలబైలు, గొడ్డివెలగల ప్రాంతాల్లోని కొండల్లో దాదాపు 600 ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉంది. రెండు రోజుల నుంచి ఆ ప్రాం తంలో మంటలు చెలరేగడంతో.. దాదాపు 500 ఎకరాల్లోని చెట్లు కాలి బూడిదయ్యాయి.

Fire అటవీప్రాంతంలో అగ్ని ప్రమాదం
తుమ్మలబైలు వద్ద కాలిపోతున్న చెట్లు

గాండ్లపెంట, మార్చి 21(ఆంధ్రజ్యోతి): మద్దివారిగొంది, కటారుపల్లి, తుమ్మలబైలు, గొడ్డివెలగల ప్రాంతాల్లోని కొండల్లో దాదాపు 600 ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉంది. రెండు రోజుల నుంచి ఆ ప్రాం తంలో మంటలు చెలరేగడంతో.. దాదాపు 500 ఎకరాల్లోని చెట్లు కాలి బూడిదయ్యాయి. ఇలా మంటలు విస్తరిస్తూ.. ఉన్న చెట్లను దగ్ధం చేస్తున్నా.. అటవీశాఖ అధికారులు ఏ మాత్రం పట్టించు కోవడం లేదు. సంవత్సరం కురిసిన వర్షాలకు ఈ ప్రాంత మంతా పచ్చదనంతో నిండిపోయింది. ఇటీవల ఎండలు ఎక్కువ కావడంతో గడ్డి ఎండిపోయింది. రెండు రోజుల క్రితం ఆకతాయిలు ఆ గడ్డికి నిప్పు పెట్టుపడడంతో మంటలు వ్యాపించాయి. అడవంతా కాలిపోతోంది. ఇప్పటికే 90 శాతం అడవి దగ్ధమైంది.

Updated Date - Mar 22 , 2025 | 12:40 AM