Share News

Chandrababu Naidu: టూరిజం గురించి 30 ఏళ్ల క్రితమే చెప్పాను

ABN , Publish Date - Mar 27 , 2025 | 05:29 AM

తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. తాను 30 ఏళ్ల క్రితమే టూరిజమే అభివృద్ధికి దారి చూపుతుందని చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా అదే భావన వ్యక్తం చేయడం ఆసక్తికరమని వ్యాఖ్యానించారు.

Chandrababu Naidu: టూరిజం గురించి 30 ఏళ్ల క్రితమే చెప్పాను

కూనంనేని వ్యాఖ్యలపై సీఎం స్పందన

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ‘గతంలో నేను కమ్యూనిజం లేదు క్యాపిటలిజం లేదు.. ఉన్నదల్లా టూరిజమేనని అన్నాను. కమ్యూనిజం లేదంటారా.. అని అప్పుడు నన్ను కమ్యూనిస్టులు తిట్టారు. నా ఉద్దేశం ఏమిటంటే టూరిజం వల్ల అభివృద్ధి జరుగుతుందని. నిన్న తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఖర్చులేని ఇజం టూరిజమని చెప్పారు. నా మాటలు అర్థం చేసుకోవడానికి వారికి 30 ఏళ్లు పట్టింది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.


ఇవి కూడా చదవండి:

Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి


Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 27 , 2025 | 05:29 AM