Share News

Tirumala Papavinasanam Dam: ‘పాపవినాశనం’ డ్యాంలో బోటింగ్‌..!

ABN , Publish Date - Mar 26 , 2025 | 03:48 AM

తిరుమలలోని పాపవినాశనం డ్యాంలో బోటింగ్‌కు సంబంధించిన వివాదం చెలరేగింది. భక్తుల తాగునీటిలో బోటింగ్‌ ఎలా అనుమతిస్తారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు మాత్రం ఇది చట్టవ్యతిరేక కార్యకలాపాల పరిశీలన కోసం చేసినదని వెల్లడించారు.

Tirumala Papavinasanam Dam: ‘పాపవినాశనం’ డ్యాంలో బోటింగ్‌..!

ఆధ్యాత్మిక కేంద్రంలో పర్యాటకమా అంటూ విమర్శలు

ఆధ్యాత్మిక కేంద్రంలో పర్యాటకమా అంటూ విమర్శలు

తిరుమల, మార్చి 25(ఆంధ్రజ్యోతి): భక్తుల దాహార్తిని తీర్చే తిరుమలలోని పాపవినాశనం డ్యాంలో ఐదుగురు వ్యక్తులు మంగళవారం కయాక్‌ బోట్లలో తిరిగారు. తిరుమలలో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా పాపవినాశనం డ్యాంలో బోటింగ్‌ ఏర్పాటు చేసేందుకు సర్వే జరిగినట్టు కొందరు ఫారెస్ట్‌ సిబ్బంది తెలిపారు. ఈ విషయం బయటకు రావడంతో భక్తుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. భక్తుల తాగునీటిలో బోటింగ్‌ చేయడం ఏమిటి?’ అంటూ భక్తులు విమర్శిస్తున్నారు. కాగా, పాపవినాశనం డ్యాంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగుతున్నట్టు సమాచారం రావడంతోనే.. తనిఖీ చేయడానికి ఈ పడవలు ఉపయోగించామని జిల్లా అటవీ అధికారి వివేక్‌ వెల్లడించినట్టు టీటీడీ వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Updated Date - Mar 26 , 2025 | 03:48 AM