-
-
Home » Andhra Pradesh » Andhra Pradesh telangana national and international latest news andhra jyothy news on 27th march 2025 suri
-

Breaking News: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..
ABN , First Publish Date - Mar 27 , 2025 | 08:25 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-27T16:41:28+05:30
కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..
కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ శాసనసభలో కామెంట్స్ చేసిన కేటీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తాము నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదు.
చంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారు.
డ్రోన్ ఎగరేస్తే రూ. 500 ఫైన్ వేస్తారు. కానీ అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు.
16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్లో ఒక మనిషి కూడా కనిపించకుండా మమ్మల్ని నిర్బంధించిన ఆ కోపాన్ని బిగపట్టుకున్నాం తప్ప కక్ష సాధింపునకు పాల్పడలేదు.
లైట్లు ఆన్లోనే పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా జైల్లో గడిపేలా చేశారు.
కరుడు గట్టిన నేరస్తున్ని బంధించినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారు.
వాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు. అంతకు అంత అనుభవిస్తారు అనుకుని ఊరుకున్నా.
నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడు.
చర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
రాజకీయ కక్ష సాధింపులంటే మీవి కదా.
అయినా నేను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదు.
నిజంగానే నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబమంతా చర్లపల్లి జైల్లో ఉండేవారు.
కానీ ఆ పని నేను చేయలేదు. మేం విజ్ఞత ప్రదర్శించాం.
ప్రజలు అధికారం ఇచ్చింది నా కక్ష తీర్చుకోవడానికి కాదని నేను విజ్ఞత ప్రదర్శించా.
సొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా.. చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించా.
ఎవరివి కక్ష సాధింపు చర్యలో తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది.
-
2025-03-27T13:22:35+05:30
డీలిమిటేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం
తీర్మానాన్ని అసెంబ్లీ ప్రవేశపెట్టిన తెలంగాణ సీఎం రేవంత్
డీలిమిటేషన్పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని తెలంగాణ అసెంబ్లీ తీవ్రంగా ఖండిస్తోంది: రేవంత్రెడ్డి
డీలిమిటేషన్ వల్ల జనాభా తగ్గించిన రాష్ట్రాలు నష్టపోకూడదు: సీఎం రేవంత్
ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలి: సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలి: రేవంత్
జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలి: సీఎం రేవంత్
2026లో జనాభా లెక్కలు చేపట్టి నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనుకోవడం చర్చనీయాంశంగా మారింది: సీఎం రేవంత్
1971 తర్వాత జనాభా నియంత్రణ విధానాలను దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా అమలు చేశాయి: రేవంత్
కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరగలేదు: రేవంత్
డీలిమిటేషన్ అనేది సౌత్కు లిమిటేషన్గా మారే ప్రమాదం ఉంది: సీఎం రేవంత్
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనం కోసం జమ్మూకశ్మీర్, అసోంలో నియోజకవర్గాలు పెంచారు: రేవంత్
పునర్విభజన చట్టంలో సీట్లు పెంచాలని స్పష్టంగా ఉంది: సీఎం రేవంత్
ఆర్థిక ప్రయోజనాలతోపాటు ఉద్యోగ, ఉపాధి అంశంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగేలా ఉంది: రేవంత్
లోక్సభ సీట్లను కూడా పునర్విభజన చేసేలా కేంద్రం ఉంది: సీఎం రేవంత్
అదే జరిగితే దక్షిణాది ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడతాయి: సీఎం రేవంత్
-
2025-03-27T13:11:45+05:30
సీఎం చంద్రబాబు కాళ్లపై పడ్డ ఎమ్మెల్సీ..
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ఆసక్తికర ఘటన
ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ఆయన కాళ్ల మీదపడ్డ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ
ఇటీవల వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జయమంగళ
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ పదవి ఇస్తాననటంతో వైసీపీకి వెళ్లిన జయమంగళ
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనంతరం ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా
శాసన మండలి ఛైర్మన్ వద్ద ఇంకా పెండింగ్లోనే జయమంగళ రాజీనామ
-
2025-03-27T12:54:25+05:30
పోలవరం రైతుల త్యాగాలు మరువలేం: సీఎం చంద్రబాబు
రైతుల త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారు: సీఎం చంద్రబాబు
మొన్నటి వరకూ నిర్వాసితులను పట్టించుకున్న నాథుడే లేడు: సీఎం చంద్రబాబు
పోలవరం కోసం 7 మండలాలు ఏపీలో కలపాలని అప్పట్లో ప్రధాని మోదీని కలిసి ఒప్పించాం: చంద్రబాబు
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూ.10 లక్షల పరిహారం ఇస్తామన్నారు: సీఎం చంద్రబాబు
జగన్ అధికారంలోకి వచ్చాక పైసా కూడా ఇవ్వలేదు: చంద్రబాబు: సీఎం చంద్రబాబు
వరదలు వచ్చినప్పుడు కూడా జగన్ పట్టించుకోలేదు: చంద్రబాబు: సీఎం చంద్రబాబు
ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును జగన్ పక్కన పెట్టారు: చంద్రబాబు
2019లోనూ టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఎప్పుడో పూర్తయ్యేది: చంద్రబాబు
ఆలస్యం కావడంతో పోలవరం ఖర్చు భారీగా పెరిగింది: సీఎం చంద్రబాబు
ఐదేళ్లలో 33 సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించా: సీఎం చంద్రబాబు
-
2025-03-27T11:59:16+05:30
తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్
కాగ్ రిపోర్ట్ను సభలో ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
గత ఐదేళ్లలో 4లక్షల 3వేల 664 కోట్ల అప్పులు: కాగ్
2023-24 ఏడాదిలో పబ్లిక్ మార్కెట్ నుంచి రూ. 49,618 కోట్ల అప్పులు
గత ఏడాది కాలంలో 200 శాతం FRBM పరిధి పెరిగినట్లు తెలిపిన కాగ్
పలు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు రూ.2 లక్షల 20 వేల కోట్లు
వేతనాల కోసం రూ.26,981 కోట్లు ఖర్చు: కాగ్ రిపోర్ట్
ఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.89 శాతం నిధులు
2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు రూ.9,934 కోట్లు
రెవెన్యూ రాబడుల్లో 45% వేతనాలు వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చు
2023-24లో రెవెన్యూ మిగులు రూ.779 కోట్లు, లోటు రూ49,977 కోట్లు
జీఎస్టీపీలో రెవెన్యూ లోటు 3.33 శాతం: కాగ్ రిపోర్ట్
2023-24 ముగిసే వరకు రుణాలు మొత్తం రూ.4,03,664 కోట్లు
జీఎస్టీపీలో అప్పుల శాతం 27 శాతంగా ఉంది: కాగ్
2023-24 వరకు గ్యారంటీలకు మొత్తం రూ.2,20,604 కోట్లు
2023-24లో తీసుకున్న రూ.50,528 కోట్లతో..
రూ.43,918 కోట్లు మూలధనం వ్యయంపై ఖర్చు: కాగ్
2023-24లో స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు రూ.76,776 కోట్లు
11% పెరుగుదల స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం నిధులు
2022-24లో ప్రభుత్వం తీసుకున్న అప్పు రూ.53,144 కోట్లు: కాగ్
-
2025-03-27T11:18:14+05:30
రసవత్తరంగా మారిన కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నిక
కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన 8 మంది వైసీపీ ఎంపీటీసీలు
ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఏడుగురు ఎంపీటీసీలు
10 మంది MPTCలతో ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే నానాజీ
వైసీపీ తీరుతో ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం
-
2025-03-27T11:11:30+05:30
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహం హైదరాబాద్కు తరలింపు
హైదరాబాద్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించిన కుటుంబసభ్యులు
సికింద్రాబాద్లోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వద్దకు ప్రవీణ్ పగడాల పార్థివదేహం తరలింపు
సాయంత్రం 4 గంటలకు తిరుమలగిరి బాప్టిస్ట్ సమాధి తోటలో అంత్యక్రియలు
పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం
పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని హోంమంత్రి, డీజీపీకి సీఎం చంద్రబాబు ఆదేశం
రాజమహేంద్రవరం చాగల్లులో క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై వెళ్లిన పాస్టర్
ద్విచక్రవాహనంపై వెళ్తూ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల
పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి గురైన సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు
పాస్టర్ మృతదేహంపై గాయాలు ఉండడంతో అనుమానం వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు
-
2025-03-27T10:29:43+05:30
హైకోర్టుకు చేరిన టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం
నల్లొండ: హైకోర్టుకు చేరిన నల్గొండ జిల్లా నకిరేకల్ టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన శాలిగౌరారానికి చెందిన ఓ విద్యా్ర్థిని
తన డిబార్ను రద్దు చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్
విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రెటరీ, నల్గొండ డీఈవో, ఎంఈవో, నకిరేకల్ పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్ను ప్రతివాదులుగా పేర్కొన్న విద్యార్థిని
ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ
-
2025-03-27T09:19:09+05:30
వంశీకి నేడు బెయిల్ వచ్చేనా..
విజయవాడ: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు వెలువరించనున్న సీఐడీ కోర్టు
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్
వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీఐడీ వాదనలు
రాజకీయ కారణాలతో కేసు పెట్టారని, వంశీ అనారోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోరిన న్యాయవాది
మంగళవారం వంశీ బెయిల్ పిటిషన్పై ముగిసిన ఇరువర్గాల వాదనలు
రిజర్వ్ చేసిన తీర్పును నేడు వెల్లడించనున్న సీఐడీ కోర్టు
-
2025-03-27T08:56:22+05:30
రైతును నరికి చంపిన దుండగులు..
తూ.గో.జిల్లా: కొవ్వూరు మండలం దొమ్మేరులో దారుణం
పెండ్యాల ప్రభాకర్ అనే రైతును దారుణంగా హత్య చేసిన దుండగులు
రైతును వేట కొడవళ్లతో నరికి చంపిన నలుగురు దుండగులు
సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
2025-03-27T08:53:57+05:30
చెరువులో పడి విద్యార్థి మృతి..
గుంటూరు: వట్టిచెరుకూరు చెరువులో పడి విద్యార్థి మృతి
బీసీ హాస్టల్లో నీళ్లు రాకపోవడంతో చెరువు వద్దకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు
ప్రమాదవశాత్తూ చెరువులో పడి ఓ విద్యార్థి మృతి
విషయం తెలిసి తీవ్ర ఆందోళనకు గురైన బాలుడి కుటుంబం
-
2025-03-27T08:46:35+05:30
భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి..
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలో తాపీ మేస్త్రి కామేశ్ చికిత్సపొందుతూ మృతి
బుధవారం ఆరంతస్తుల భవనం కూలిన ఘటనలో గాయపడిన కామేశ్
ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ నేడు మృతి
కూలిన భవనం వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు
శిథిలాల కింద ఎంత మంది ఉన్నారనే దానిపై రాని స్పష్టత
-
2025-03-27T08:30:55+05:30
SLBC టన్నెల్లో దుర్వాసన..
SLBC టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ
మరోచోట దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది
కొనసాగుతున్న టీబీఎం మిషన్ కటింగ్
మట్టి, నీటిని తోడుతున్న రెస్క్యూ టీమ్
ప్రతి 2.5 కిలోమీటర్లకు పంపింగ్ స్టేషన్ ఏర్పాటు
-
2025-03-27T08:29:47+05:30
ఎన్నిక నేడే..
నేడు కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక
ఇప్పటికే క్యాంప్లో ఉన్న వైసీపీ జెడ్పీటీసీలు
స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీ హైకోర్టు
మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పిన కోర్టు
-
2025-03-27T08:25:36+05:30
రెచ్చిపోయిన దాడి దోపిడీ దొంగలు..
అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గంలో రెచ్చిపోయిన దారి దోపిడీ దొంగలు
ఆమిద్యాల, వజ్రకరూర్లో పెట్రోల్ బంకులపై దాడి చేసి భారీగా చోరీ
ఆమిద్యాలలో పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించి రూ.2.20లక్షలు అపహరణ
వజ్రకరూరులో పెట్రోల్ బంకుపై దాడి చేసి రూ.1.50లక్షలు దోపిడీ
ముఖానికి మాస్కులు ధరించిన ఆరుగురు దోపిడీకి పాల్పడినట్లు చెబుతున్న సిబ్బంది
పెట్రోల్ బంక్ల సిబ్బందిపై దాడి చేసి సీసీ కెమెరాలు పగులగొట్టి హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లిన దుండగులు
బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు