నిడదవోలులో వేడెక్కిన రాజకీయం
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:51 AM
నిడదవోలు మునిసిపాలిటీలో రాజకీయం ఒక్క సారి వేడెక్కింది..కౌన్సిల్ సభ్యులు ఎత్తుకు పైఎ త్తులు వేస్తున్నారు. ఎలాగైనా సరే చైర్మన్ కుర్చీని కైవసం చేసుకోవాలని అటు వైసీపీ, వైసీపీని చిత్తుగా ఓడించాలని జనసేన వ్యూహ ప్రతివ్యూహాలతో అడుగులు వేస్తున్నాయి.

వైసీపీ కౌన్సిలర్ల ముందడుగు
కలెక్టర్,ఆర్డీవోలకు విన్నపం
ఈ నెల 18కి నాలుగేళ్లు పూర్తి
పట్టు బిగిస్తున్న జనసేన
ఇప్పటికే కూటమిలో 10 మంది
జనసేనలోకి మరో నలుగురు?
మారుతున్న పరిణామాలు
నిడదవోలు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : నిడదవోలు మునిసిపాలిటీలో రాజకీయం ఒక్క సారి వేడెక్కింది..కౌన్సిల్ సభ్యులు ఎత్తుకు పైఎ త్తులు వేస్తున్నారు. ఎలాగైనా సరే చైర్మన్ కుర్చీని కైవసం చేసుకోవాలని అటు వైసీపీ, వైసీపీని చిత్తుగా ఓడించాలని జనసేన వ్యూహ ప్రతివ్యూహాలతో అడుగులు వేస్తున్నాయి. ఇది లా ఉండగా గురువారం మునిసిపల్ చైర్మన్పై అవిశ్వాసానికి తీర్మానం పెట్టాలంటూ వైసీసీ కౌన్సిలర్లు ఆర్డీవో, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు.నిడదవోలు మునిసిపాలిటీలో 28 వార్డులకు 2021 మార్చి 15వ తేదీన ఎన్నికలు జరగ్గా 27 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్లు విజయం సాధించగా ఒక వార్డులో మాత్రమే టీడీపీ విజ యం సాధించింది. దీంతో నిడదవోలు కౌన్సిల్ వైసీపీ వశమైంది.ఈ నేపథ్యంలో అప్పటి ఎమ్మె ల్యే జి.శ్రీనివాస్ నాయుడు చైర్మన్ పదవీ కాలాన్ని పంచుకునేలా ఒప్పందం కుదిర్చారు. మొదటి రెండున్నరేళ్లు మునిసిపల్ చైర్మన్గా భూపతి ఆదినారాయణ, తరువాత రెండేళ్లు కామిశెట్టి వెంకట సత్యనారాయణ తరువాత మిగిలిన కాలం పువ్వల రతీదేవి చైర్మన్గా ఒప్పందం చేసుకున్నారు.ఇదిలా ఉండగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీనివాస్ నాయుడు ఓట మిపాలయ్యారు. నిడదవోలు నుంచి జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు, చైర్మన్ భూపతి ఆదినారాయణకు మధ్య ఉన్న ఆర్థిక, ఆంతరంగిక వ్యవహారాల కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది.దీంతో భూపతి ఆది నారాయణతో పాటు మరో ఎనిమిది మంది వైసీపీ కౌన్సిలర్లు జనసేన కండువా కప్పుకు న్నారు. దీంతో చైర్మన్ ఒప్పందం వివాదం ముదిరి పాకాన పడింది. మునిసిపల్ కౌన్సిల్ ఏర్పడి ఈ నెల 18వ తేదీ నాటికి నాలుగేళ్లు పూర్తవడంతో అవిశ్వాస తీర్మానానికి అవకాశం వచ్చింది. ఇదిలా ఉండగా వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ కలెక్టర్ పి.ప్రశాంతి, కొవ్వూరు ఆర్డీవో రాణిసుస్మితలకు గురువారం వినతిపత్రం అందజేశారు. చైర్మన్ పై అవిశ్వాసానికి తమకు అవకాశం ఇవ్వా లంటూ పలువురు వైసీపీ కౌన్సిలర్లు సంతకాలు పెట్టారు.ఈ నేపథ్యంలో నిడదవోలులో ఎటు చూసినా చైర్మన్ కుర్చీపైనే చర్చ సాగుతోంది.
నిడదవోలు..
జనసేన వశమయ్యేనా?
నిడదవోలు మునిసిపల్ కౌన్సిల్లో చైర్మన్ పదవిని వైసీపీ కైవసం చేసుకోవాలని చూస్తుం డగా ఇందుకు జనసేన పార్టీ ఎత్తులకు పైఎ త్తులు వేస్తుంది. వైసీపీ ప్రవేశపెట్టనున్న అవి శ్వాస తీర్మానం వీగిపోయేలా జనసేన వ్యూహా త్మకంగా అడుగులు వేస్తుంది. పురపాలక సం ఘంలోని 28 మంది కౌన్సిలర్లలో ఒకరు టీడీపీ కాగా మరో తొమ్మిది మంది జనసేన తీర్థం తీసుకున్నారు.మరో 18 మంది వైసీపీలో ఉం డగా అవిశ్వాస తీర్మానం నిరూపించు కోవడా నికి 19 మంది (2/3) బలం కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వైసీపీలో ఉన్న 18 మంది లో మరో నలుగురు కౌన్సిలర్లు ఇప్పటికే జన సేనతో జతకట్టి చైర్మన్ కుర్చీని జనసేన ఖాతా లో వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నిడదవోలు పురపాలక సంఘ కౌన్సిల్ను జనసేన ఖాతాలో వేసి మంత్రి కందుల దుర్గేష్కు బహుమతిగా ఇచ్చేందుకు నిడదవోలు జనసేన పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.