డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:55 PM
మండలంలోని పూడిచెర్ల బస్ స్టేజీ సమీపాన రైతు సూర్య రాజన్న పొలంలో ఫారం పాండ్స్ భూమి పూజ కార్యక్రమానికి శనివారం రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫారం పాండ్స్ భూమి పూజ చేసిన సమీపాన బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

ఓర్వకల్లు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పూడిచెర్ల బస్ స్టేజీ సమీపాన రైతు సూర్య రాజన్న పొలంలో ఫారం పాండ్స్ భూమి పూజ కార్యక్రమానికి శనివారం రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫారం పాండ్స్ భూమి పూజ చేసిన సమీపాన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు దాదాపు 6వేల నుంచి 8వేల మంది దాకా ప్రజలు వచ్చే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం రాక సందర్భంగా 500 మంది పోలీసులను గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి సభా స్థలానికి వాహనాల ద్వారా రానున్న సందర్భంగా రోడ్డు వెంట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చే వాహనాలు కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు.