లీకేజీ అరికట్టకుంటే తప్పదు వ్యథ..!
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:54 PM
వేసవిలో తాగునీరు ఓ వైపు ప్రజలు అల్లాడుతుంటే అధికారుల నిర్లక్ష్యంతో తానీరు వృథా అవుతోంది.

ఆస్పరి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): వేసవిలో తాగునీరు ఓ వైపు ప్రజలు అల్లాడుతుంటే అధికారుల నిర్లక్ష్యంతో తానీరు వృథా అవుతోంది. ఆస్పరికి నాగనాతనహళ్లి నీటి పథకం నుంచి సరఫరా అయ్యే తాగునీరు నగరూరు రోడ్డు వద్ద వృథాగా పోతోంది. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ హనుమంతప్ప దృష్టికి తీసుకెళ్లగా పైపులైన్ లీకేజీలను సరిచేస్తామని వివరణ ఇచ్చారు.