Nagababu Pithapuram Visit: పిఠాపురంలో నాగబాబు పర్యటన
ABN , Publish Date - Apr 05 , 2025 | 03:36 AM
ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి పిఠాపురం పర్యటించిన నాగబాబు, గొల్లప్రోలు గ్రామంలో అన్నక్యాంటీన్ను ప్రారంభించారు. పర్యటన సందర్భంగా టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య నినాదాలు మారుమోగాయి.

అన్న క్యాంటీన్ను ప్రారంభించిన జనసేన ఎమ్మెల్సీ
పిఠాపురం/గొల్లప్రోలు, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు శుక్రవారం పర్యటించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఆయన నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా గొల్లప్రోలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. గొల్లప్రోలులోని మెయిన్రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్ను ప్రారంభించారు. అనంతరం పలువురికి మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. కార్యక్రమంలో పలువురు జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇదిలావుంటే, నాగబాబు పర్యటనలో టీడీపీ, జనసేన కార్యకర్తలు పోటా పోటీ నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణులు ‘జై వర్మ’ అని నినదించడంతో జనసేన కార్యకర్తలు ‘జై జనసేన, జై పవన్కల్యాణ్’ నినాదాలు చేశారు. 150 మందికిపైగా పోలీసులతో అధికారులు భద్రత కల్పించారు.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News