భూగర్భ జలాలు పెంపొందించాలి
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:58 PM
భూగర్భ జలాలు పెంపొం దించేలా రైతులు ముందుకు రావాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు.

గార, మార్చి 22(ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాలు పెంపొం దించేలా రైతులు ముందుకు రావాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. శనివారం అంపోలులో ఉపాధి పథకం ద్వారా ఏర్పాటు చేయనున్న ఫాంపాండ్స్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభిం చి మాట్లాడారు. నీటి కుంటలు ఏర్పాటు వల్ల పొలాల్లో భూగర్భ జలాలు పెరిగి పంటలకు ఎంతో మేలు చేస్తాయన్నారు. కార్యక్ర మంలో ఏపీడీ లోకేష్, ఎంపీడీవో ఎస్.రామ్మోహనరావు, ఏపీవో సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
రణస్థలం, మార్చి 22(ఆంద్రజ్యోతి): భూగర్భ జాలాల పెంపొందించేందుకు రైతులు కృషి చేయాలని ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావు అన్నారు. ప్రపంచ జల దినోత్సవం సంద ర్భంగా శనివారం యాగాటపాలెం గ్రామానికి చెందిన ముసల య్య పొలంలో నీటికుంటల నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ చేశారు. వర్షపు నీరు నిల్వ చేసేందుకు ఈ నీటి కుంటలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఈశ్వరరావు, ఈవోపీఆర్డీ ధనుంజయరావు, ఏపీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.