టీచర్ల సమస్యలపై ఫ్యాప్టో నిరసన
ABN , Publish Date - Apr 02 , 2025 | 10:56 PM
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఫ్యాప్టో)రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు బుధవారం జిల్లా సంఘం నాయకులు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.

పాడేరురూరల్, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఫ్యాప్టో)రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు బుధవారం జిల్లా సంఘం నాయకులు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్కు అందించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్ రావుల జగన్మోహన్రావు, కార్యదర్శి వి.మహేశ్వరరావు మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని, అది ఆలస్యమైతే వెంటనే ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని, కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా నాయకులు వల్లా వెంకటరమణ, జి.వికాస్, కె.ధనుర్జయ్, వివిధ సంఘాల జిల్లా, మండల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.