బోయింగ్లో 180 మందికి ఉద్వాసన
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:47 AM
అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ బెంగళూరులోని తమ ఇంజనీరింగ్ టెక్నాలజీ సెంటర్లో 180 మందికి ఉద్వాసన చెబుతోంది...

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ బెంగళూరులోని తమ ఇంజనీరింగ్ టెక్నాలజీ సెంటర్లో 180 మందికి ఉద్వాసన చెబుతోంది. వారికి పింక్ స్లిప్లు ఇచ్చినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ కంపెనీలో 7,000 మంది వరకు ఉద్యోగులు పని చేస్తున్నారు. గత ఏడాది కూడా కంపెనీ 10 శాతం మంది ఉద్యోగులను తగ్గించింది. అయితే దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ కంపెనీకి బెంగళూరు, చెన్నై నగరాల్లో ఇంజనీరింగ్, టెక్నాలజీ సెంటర్లున్నాయి.
ఇవి కూడా చదవండి:
Onion Prices: గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..
Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News