Gold and Silver Prices: బాబోయ్.. ఇదేంటి.. బంగారం ధర ఇలా పెరుగుతోంది..
ABN , Publish Date - Mar 26 , 2025 | 07:03 AM
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధర మళ్లీ పెరిగింది. మంగళవారం పసిడి రేటు కాస్త తగ్గి ఊరటనిచ్చినప్పటికీ మళ్లీ నేడు పుంజుకుంది. దీంతో ఇలా అయితే బంగారం కొనేదెలా అంటూ పసిడి ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బిజినెస్ న్యూస్: బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. నిన్న (మంగళవారం) తగ్గినట్లే తగ్గిన రేటు నేడు(బుధవారం) మళ్లీ పుంజుకుంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో వరసగా కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి రేటు కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తోంది. నిన్న స్వల్పంగా తగ్గి కాస్త ఊరట కలిగించినప్పటికీ ఇవాళ మళ్లీ షాక్ ఇచ్చింది. బుధవారం ఉదయం 06:30 గంటల సమయానికి https://bullions.co.in/ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.80,392 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.87,700కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,529 కాగా.. 24 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.87,850 వద్ద కొనసాగుతోంది. అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.80,658 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.87,990కు చేరుకుంది.
దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధర పరిస్థితి ఎలా ఉందంటే..
బెంగళూరు- రూ.80,593, రూ.87,920
పుణె- రూ.80,529, రూ.87,850
అహ్మదాబాద్- రూ.80,639, రూ.87,970
భువనేశ్వర్- రూ.80,548, రూ.87,870
భోపాల్- రూ.80,612, రూ.87,940
కోల్కతా- రూ.80,419, రూ.87,730
చెన్నై- రూ.80,768, రూ.88,110
కోయంబత్తూర్- రూ.80,768, రూ.88,110
పట్నా- రూ.80,483, రూ.87,800
సూరత్- రూ.80,639, రూ.87,970
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశవ్యాప్తంగా వెండి ధరలు సైతం భారీగా పెరిగాయి. ఢిల్లీలో మంగళవారం కేజీ వెండి ధర రూ.97,470 ఉండగా.. నేడు(బుధవారం) రూ.99,120కు పెరిగింది. ముంబైలో నిన్న కిలో వెండి రేటు రూ.97,640 కాగా.. ఇవాళ రూ.99,290కు చేరింది. అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కేజీ వెండి ధర మంగళవారం రూ.97,790 ఉండగా.. ఈరోజు రూ.99,440కు పెరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి:
బ్యాంకుల్లోని అన్-క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.78,000 కోట్ల పైమాటే..
ఢిల్లీ హైకోర్టులో ‘నాట్కో’కు ఊరట