కార్లు మరింత ప్రియం
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:56 AM
దేశీయ విపణిలో కార్ల ధరలు ప్రియం కానున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సుమారుగా అన్ని కంపెనీల కార్ల ధరలు పెరగనున్నాయి....

ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు
న్యూఢిల్లీ: దేశీయ విపణిలో కార్ల ధరలు ప్రియం కానున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సుమారుగా అన్ని కంపెనీల కార్ల ధరలు పెరగనున్నాయి. మారుతి సుజుకీ, మహీంద్రా, హ్యుండయ్, టాటా మోటా ర్స్, కియా, రెనో, హోండా కంపెనీలే కాకుండా లగ్జరీ కార్ల కంపెనీలైన మెర్సిడెజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి కంపెనీలు కూడా కార్ల ధరలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. కార్ల ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. మోడల్ను బట్టి కార్ల ధరలో పెంపు శాతం భిన్నంగా ఉంటుంది. మారుతి సుజుకీ గరిష్ఠంగా 4ు పెంపును ప్రకటించగా హ్యుండయ్ 3ు, టాటా మోటార్స్ 2ు, మహీంద్రా 3ు పెంచుతున్నట్టు తెలిపాయి.
ఇవి కూడా చదవండి:
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
Onion Prices: గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..
Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News