Share News

Breaking News: నంద్యాలలో రైలు ప్రమాదం..

ABN , First Publish Date - Mar 09 , 2025 | 08:51 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: నంద్యాలలో రైలు ప్రమాదం..
Breaking News

Live News & Update

  • 2025-03-09T13:55:17+05:30

    నంద్యాలలో రైలు ప్రమాదం..

    • నంద్యాల : గాజులపల్లె దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.

    • పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం.

    • యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన అధికారులు.

  • 2025-03-09T13:07:52+05:30

    అసెంబ్లీకి కేసీఆర్..

    • ఈనెల 12నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.

    • అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్.

    • బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయం.

    • ఈనేపధ్యంలో బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించనున్న కేసీఆర్.

    • కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో మంగళవారం మధ్యహానం 1గంలకు సమావేశం.

    • అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్.

    • కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామంటోన్న బీఆర్ఎస్ అధినేత.

    • ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ ను ఎండగడుతామంటోన్న మాజీ సీఎం.

  • 2025-03-09T12:55:20+05:30

    ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికపై తెగని ఉత్కంఠ..

    • అమరావతి: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికపై తెగని ఉత్కంఠ..

    • 5 స్థానాలకు గాను జనసేన నుంచి నాగేంద్ర బాబు పేరు ఖరారు.

    • తెలుగు దేశం నుంచి అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి కసరత్తు.

    • టీడీపీ నుంచి నలుగురికి అవకాశం.

    • తీవ్ర స్థాయిలో ప్రయత్నాల్లో 10 మంది పైగా నేతలు.

    • నామినేషన్లకు సోమవారం చివరి తేదీ.

    • ఈ రోజు సాయంత్రంలోగా లిస్ట్ విడుదల అయ్యే అవకాశం.

    • విజయవాడలో మొహరించిన ఆశావహులు.

    • మరోవైపు ఎవరినీ కలవకుండా చంద్రబాబు కసరత్తు.

    • మరో రెండు మూడు గంటల్లో ఉత్కంఠకు తెరపడే అవకాశం.

    • అభ్యర్థులతో పాటు తమ నాయకులకు అవకాశం ఉంటుందా లేదా అనే సస్పెన్స్‌లో అనుచరులు.

  • 2025-03-09T10:02:13+05:30

    ఉపరాష్ట్రపతికి స్వల్ప అస్వస్థత

    • ఢిల్లీ: స్వల్ప అస్వస్థతకు గురైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్‌.

    • ఈరోజు ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని కార్డియాక్ విభాగంలో చేరిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్‌.

    • ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందన్న ఎయిమ్స్ వైద్యులు.

  • 2025-03-09T08:51:07+05:30

    కామారెడ్డి: దోమకొండ మండలం సీతారాంపల్లిలో దారుణం

    • రాధిక (28) అనే వివాహిత విద్యుత్ షాక్ తో మృతి.

    • తన బైక్ నుంచి పెట్రోల్ దొంగిలిస్తున్నారని బైక్ కు విద్యుత్ షాక్ పెట్టిన భర్త రాజనర్సు

    • విషయం తెలియక బైక్ ను ముట్టుకున్న భార్య రాధిక.

    • షాక్ తగిలి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి