-
-
Home » Mukhyaamshalu » Todays Breaking News 16th April 2025 Wednesday Live Updates in Telugu News Siva
-

Breaking News: కూటమి నేతల అవిశ్వాస తీర్మానం నోటీస్ తిరస్కరణ
ABN , First Publish Date - Apr 16 , 2025 | 09:48 AM
Todays Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-04-16T17:41:54+05:30
కూటమి నేతల అవిశ్వాస తీర్మానం నోటీస్ తిరస్కరణ
విశాఖపట్టణం మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్- 2 కట్టమూరి సతీష్ పై కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్ తిరస్కరణ
డిప్యూటీ మేయర్గా కట్టమూరి సతీష్ పదవీకాలం నాలుగు సంవత్సరాలు ఇంకా పూర్తి కానందున అవిశ్వాస తీర్మానం నోటీసు తిరస్కరించిన జిల్లా కలెక్టర్
మునిసిపల్ చట్టం ప్రకారం 4 ఏళ్లు పదవీ కాలం పూర్తి కానందునే అవిశ్వాస తీర్మానం నోటీస్ తిరస్కరణ
ఈ ఏడాది జూలై 30 కి కట్టమూరి సతీష్ నాలుగేళ్ల పదవి కాలం పూర్తి
మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, మరో డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్ అంగీకారం
ఈ నెల 19న మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపైన, ఈ నెల 26న డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ పై అవిశ్వాస తీర్మానం పై జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం
-
2025-04-16T16:08:29+05:30
వక్ఫ్ చట్టంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
వక్ప్ సవరణ చట్టంపై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరణ
వక్ప్ సవరణ చట్టం చట్టబద్దతను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసిన సిజెఐ ధర్మాసనం
-
2025-04-16T12:49:50+05:30
ఆదోని మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం
కర్నూలు: ఆదోని మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం
అవిశ్వాస తీర్మానానికి హాజరుకాని చైర్పర్సన్ శాంత
ప్రత్యేక బస్సుల్లో మున్సిపల్ ఆఫీస్కు 35 మంది వైసీపీ కౌన్సిలర్లు
గుర్తింపు కార్డులున్న కౌన్సిలర్లను లోపలకు అనుమతి
-
2025-04-16T12:15:44+05:30
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగులను తొలగించారు
సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరినీ ఈ నెలాఖరులోగా రిలీవ్ కావాలని ఆదేశించింది.
సుమారు 500 మంది ఉద్యోగుల తొలగింపు
ఇక ముందు ఎటువంటి పొడిగింపు ఉండబోదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది.
వైసిపి నేతలు చెప్పిన వారినందరిని గతంలో ఫైబర్ నెట్లో చేర్చుకున్న అప్పటి యాజమాన్యం.
పులివెందుల, కడప జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారిని ఉద్యోగులుగా చేర్చిన అంశంపై అప్పటిలోనే వెలుగులోకి తెచ్చిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.
ఫైబర్ నెట్ కార్యాలయానికి రాకుండా జీతాలు తీసుకున్న ఉద్యోగులు.
-
2025-04-16T12:11:34+05:30
హెచ్సీయూ భూములపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు..
హెచ్సీయూ భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరుగగా.. తెలంగాణ ప్రభుత్వంపై జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టులో విచారణ జరిగిన విధానం ఇదీ..
చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలన్న జస్టిస్ బీఆర్ గవాయ్
1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలన్న జస్టిస్ గవాయ్
అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు చెప్పిన ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి.
తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని, దాని ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని వివరించిన అమికస్ క్యూరీ.
అనుమతులు తీసుకున్నారా లేదా.. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న జస్టిస్ గవాయ్.
మీరు చీఫ్ సెక్రటరీని కఠినమైన చర్య నుండి కాపాడాలనుకుంటే, ఆ వంద ఎకరాలను ఎలా పునరుద్ధరించాలో ఒక ప్రణాళికతో ముందుకు రావాలన్న ధర్మాసనం.
1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వ్యవహరించినా చూస్తూ ఊరుకొమని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు.
మూడు రోజుల సెలవుల్లో అలా చేయడానికి అంత తొందర ఏమిటి.
ఆ సెలవుల్లోనే బుల్డోజర్లు తీసుకొచ్చారు.
పర్యావరణాన్ని కాపాడటానికి మేము ఇక్కడ ఉన్నాము.
రూ. 10 వేల కోట్లకు మార్టిగేజ్ చేసారని సీఈసీ నివేదికలో చెప్పిందన్న అమికస్ క్యూరీ.
భూములను మార్టిగేజ్ చేసారా లేదా, అమ్ముకున్నారో లేదో మాకు మాకు అనవసరం.
చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా లేదా అనేది ముఖ్యం అన్న జస్టిస్ గవాయ్.
2004 నుంచి ఈ భూముల వ్యవహారం, కోర్టుల్లో ఉన్న పరిస్థితి, తర్వాత చుట్టుపక్కల జరిగిన అభివృద్ధి, ఐటి పార్కు, ఇతర ప్రాజెక్టులు వివరాలు చెప్పిన అభిషేక్ మను సింఘ్వి.
వంద ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి అన్న విషయం పైనే తాము దృష్టి సారించాలని అంటున్నామన్న జస్టిస్ గవాయ్
వంద ఎకరాల్లో జంతువులకు తీవ్ర నష్టం జరుగుతుందన్న మరో న్యాయవాది నిరంజన్ రెడ్డి.
సీఎస్ ఫైల్ చేసిన అఫిడవిట్ చూస్తే ఆశ్చర్యంగా ఉందన్న నిరంజన్.
వంద ఎకరాలు మార్టిగేజ్ చేసి, చెట్లు కొట్టేసి ఇప్పుడు పర్యావరణ హితమైన ఐటి పార్క్ అని చెపుతున్నారన్న నిరంజన్ రెడ్డి.
పర్యావరణ పరిరక్షణ కోసం ఏమైనా చేస్తామన్న జస్టిస్ గవాయ్.
ఆ భూముల్లో ఉన్న జంతుజాలాన్ని ఎలా సంరక్షిస్తారో చెప్పాలన్న జస్టిస్ గవాయ్.
సీఈసీ నివేదికలో మార్టిగేజ్ వ్యవహారం స్పష్టంగా ఉందన్న అమికస్ క్యూరీ.
రాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ పెట్టినా.. ఈ భూములను వెంటనే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి అప్పజెప్పాలని కోరిన అమికస్ క్యూరీ
మే 15వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు.
మార్టిగేజ్ వ్యవహారం తమకు సంబంధం లేదన్న జస్టిస్ గవాయ్.
పర్యావరణ అనుమతులు ఉన్నాయా లేదా... 1996 మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది ముఖ్యమని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు.
దెబ్బతిన్న పర్యావరణాన్ని ఎలా పునరుద్దరిస్తారో అణా విషయం మాకు ప్రధానం అన్న జస్టిస్ గవాయ్.
మిగిలిన వ్యవహారాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసిన జస్టిస్ గవాయ్.
సీఈసీ నివేదికపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చిన ధర్మాసనం
ఆర్టికల్ 142 కింద పర్యావరణ పరిరక్షణ కోసం ఏమైనా చేస్తామన్న జస్టిస్ బిఆర్ గవాయ్.
పునరుద్ధరణ ఎలా చేస్తారు, ఎంత కాలంలో చేస్తారు, జంతు జలాన్ని ఎలా సంరక్షిస్తారో స్పష్టంగా చెప్పాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశం.
నాలుగు వారాల్లో ప్రణాళిక ఫైల్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో స్టేటస్కో కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొన్న సుప్రీంకోర్టు.
తదుపరి విచారణను మే 5కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు.
పునరుద్ధరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తే, మీ అధికారులను తాత్కాలికంగా జైలుకు పంపిస్తాం. ఈ మధ్యకాలంలో అక్కడ ఒక్క చెట్టైనా కొట్టరాదు. బుల్డోజర్లు తొలగించబడ్డాయా అని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు.
100 ఎకరాల్లో జరిగిన నష్టం కారణంగా ప్రభావితమైన వన్యప్రాణులను రక్షించేందుకు అవసరమైన తక్షణ చర్యలను పరిశీలించి, అమలులోకి తీసుకురావాలని తెలంగాణ వన్యప్రాణి సంరక్షణాధికారిని సుప్రీంకోర్టు ఆదేశించింది.
-
2025-04-16T12:00:21+05:30
తిరుమలలో భారీ స్కామ్..
తిరుమల: గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీవారి ఆలయంలో భారీ స్కాం జరిగిందని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
కోట్లాది రూపాయల తులాభారం కానుకలను ఇంటి దొంగలు కాజేసారు.
స్వామి వారికీ మొక్కులు చెల్లింపులో భాగంగా భక్తులు వివిధ రూపంలో తులాభారం సమర్పిస్తారు.
తులా భారం ద్వారా నిత్యం 10 లక్షల రూపాయలను భక్తులు కానుకలను సమర్పిస్తున్నారు.
గత 5ఏళ్ల వైసీపీ పాలనలో కోట్లాది రూపాయల తులా భారం కానుకలను స్వాహా చేశారు.
తులా భారంలో అక్రమాలు జరిగినట్లు విజిలేన్స్ నివేదిక ఇస్తే అధికారులు తాత్కాలిక ఉద్యోగులను తొలగించి చేతులు దులుపుకున్నారు.
తులా భారంలో అక్రమాలపై విజిలేన్స్ విచారణకి డిమాండ్ చేస్తున్నా.
శ్రీవారి ఆలయం వద్ద డ్రోన్ ఎగరడం నిఘా వైఫల్యంగా భావిస్తున్నా.
భద్రతా సిబ్బంది కొరత వుంది.. సిబ్బందిని కూడా పెంచుతాం.
త్వరలోనే యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకొస్తాం.
-
2025-04-16T11:35:34+05:30
గుంటూరు: అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్
లూయిస్ కాల్ సెంటర్ పేరుతో అశ్లీల వీడియోల చిత్రీకరణ
మహిళ సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
వీడియోలతో పాటు లైవ్ షోస్ను వెబ్సైట్లకు ఇస్తున్నారు: ఈగల్
క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు
గుంతకల్కు చెందిన లూయిస్ కాల్ సెంటర్ నడుపుతూ..
ఉద్యోగులతో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నాడు
లూయిస్తో పాటు శ్రీకాకుళంకు చెందిన గణేష్, జ్యోత్సను అరెస్ట్ చేశాం
-
2025-04-16T11:34:09+05:30
అమరావతి: సీఎం చంద్రబాబుతో 16వ ఆర్థిక సంఘం సభ్యులు భేటీ
హాజరైన డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు లోకేష్, నారాయణ
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆర్థిక సంఘం సభ్యులకు వివరణ
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, సాయంపై చర్చ
-
2025-04-16T11:28:14+05:30
దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపు.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ అభ్యంతరం.
టీపీసీసీ చీఫ్ అందుబాటులో లేని కారణంగా తెలంగాణలో రేపు నిరసనలు చేపట్టాలని నిర్ణయం.
టీపీసీసీ చీఫ్ లేకపోయినా.. అధిష్టానం పిలుపుతో ధర్నా చేస్తానంటున్న సీనియర్ నేత వీహెచ్.
ఈడీ కార్యాలయం ఎదుట బైఠాయించి వీహెచ్ నిరసన.
-
2025-04-16T10:15:02+05:30
హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు
సురానా, సాయిసూర్య డెవలపర్స్ కంపెనీల్లో తనిఖీలు.
బోయిన్పల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్లో సోదాలు.
సురానా గ్రూప్ చైర్మన్, ఎండీ, డైరెక్టర్ ఇళ్లలో తనిఖీలు.
సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ ఎండీ ఇంట్లో సోదాలు.
3 బ్యాంకులకు రూ.3,986 కోట్లు ఎగ్గొట్టిన సురానా గ్రూప్.
రుణాలు చెల్లించపోవడంపై 3 కేసులు నమోదు చేసిన సీబీఐ.
సురానాకు అనుబంధంగా పనిచేస్తున్న సాయిసూర్య డెవలపర్స్.
2021 ఫిబ్రవరిలో సురానా కంపెనీలో జరిగిన ఈడీ సోదాల్లో రూ.11.62కోట్ల విలువైన బంగారం, నగదు సీజ్.
సురానా గ్రూప్, అనుబంధ సంస్థలపై PMLA కేసు నమోదు.
కంపెనీ ఎండీ దినేష్చంద్ సురానా, విజయ్రాజ్ సురానా, ఇద్దరు డమ్మీ డైరెక్టర్లను 2022లో అరెస్ట్ చేసిన ఈడీ.
-
2025-04-16T10:10:42+05:30
చైనా సుంకాల విషయంలో చర్చలపై వైట్హౌస్ కీలక ప్రకటన
బంతి చైనా కోర్టులోనే ఉంది
చైనాతో వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారు.
చర్చలకు రావాల్సింది చైనానే.. మాకు ఆ అవసరం లేదు.
చైనాకు, ఇతర దేశాలకు మధ్య తేడా లేదు.
కాకపోతే చైనాపై సుంకాలు ఎక్కువగా ఉన్నాయి.
మా మార్కెట్ పైనే చైనా ఎక్కువగా ఆధారపడుతుంది.
-
2025-04-16T09:48:29+05:30
తెలంగాణలో అకాల వర్షం బీభత్సం..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం
రాత్రి కురిసిన అకాల వర్షానికి నర్సంపేట డివిజన్లో..
మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం
దుగ్గొండిలో నేలకూలిన విద్యుత్ స్తంబాలు, చెట్లు
నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో తడిసిన మొక్కజొన్నలు
మహబూబాబాద్ జిల్లాలోనూ గాలివాన బీభత్సం
మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాల్లో భారీగా పంట నష్టం