Share News

Breaking News: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. రాజ్ కసిరెడ్డి ఇంటికి నోటీసులు

ABN , First Publish Date - Apr 14 , 2025 | 12:47 PM

Todays Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. రాజ్ కసిరెడ్డి ఇంటికి నోటీసులు
Breaking news

Live News & Update

  • 2025-04-14T18:15:38+05:30

    ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం

    • ఏపీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఏపీ సిట్ సోదాలు

    • గచ్చిబౌలిలోని ఒక ఆసుపత్రిలో కొనసాగుతున్న ఏపీ సిట్ సోదాలు

    • రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్ లో గాలింపు

    • రాయదుర్గం పోలీసుల సహాయంతో ఆసుపత్రిలో ఏపీ సిట్ బృందాలు సోదాలు

    • రాజ్ కసిరెడ్డి కి చెందిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో డైరెక్టర్లు

    • సిట్ విచారణకు హాజరుకాకుండా హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లు సిట్ అనుమానం

    • ఏపీ లిక్కర్ స్కామ్‌లో రాజ్ కసిరెడ్డి కీలకపాత్ర పోషించినట్లు గుర్తింపు

    • జూబ్లీహిల్స్‌తో పాటు గచ్చిబౌలి, ఫైనాన్స్ డిస్ట్రిక్‌లో ఏపీ సిట్ బృందాల గాలింపు

    • రాజ్ కసిరెడ్డి దేశం దాటి వెళ్లకుండా ఇప్పటికే ఎల్ఓసి ఇచ్చిన ఏపీ పోలీసులు

    • సిట్ విచారణకు హాజరుకావాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ తప్పించుకొని తిరుగుతున్న రాజ్ కసిరెడ్డి

    • జూబ్లీహిల్స్‌లో రాజ్ కసి రెడ్డి నివాసానికి నోటీసులు అంటించునున్న ఏపీ సిట్ బృందం

  • 2025-04-14T17:25:03+05:30

    సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్

    • కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్

    • ఈనెల 16న సుప్రీంలో కంచ గచ్చిబౌలి భూములపై విచారణ

    • కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములేనని అఫిడవిట్ లో పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం

    • ఈ భూముల్లోనే యూనివర్శిటీ, మరికొన్ని సంస్థలు, బస్టాండ్‌లు వచ్చాయని సుప్రీంకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

    • సుమారు 20 ఏళ్లకు పైగా 400 ఎకరాల స్థలం న్యాయవివాదంలో ఉన్నందున అక్కడ చెట్లు పెరిగి అడవిలాగా తయారైందన్న తెలంగాణ ప్రభుత్వం

    • గత రెండు రోజులనుంచి ఢిల్లీలో మకాం వేసి, సీనియర్ న్యాయవాదులతో చర్చించి అపిడవిట్ ను సిద్దం చేసిన సిఎస్ శాంతి కుమారి

  • 2025-04-14T13:55:02+05:30

    అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన మళ్లీ ప్రారంభిస్తాం

    • విదేశీ విద్యా దీవెన కోసం గతంలో రూ.467 కోట్లు ఖర్చు చేశాం.

    • అప్పుడు ఈ పథకం ద్వారా 7 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.

    • వైసీపీ హయాంలో కేవలం 437 మందికి మాత్రమే అవకాశం కల్పించారు.

  • 2025-04-14T13:28:27+05:30

    కూటమి రాకతో ప్రజలకు స్వేచ్ఛ

    • కూటమి ప్రభుత్వ రాకతో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు.

    • గత ఐదేళ్ల వైసీపీ పాలనలో భయానక పరిస్థితులు

    • ఈ పది నెలల్లో మెరుగైన పాలన అందించాం

  • 2025-04-14T13:28:26+05:30

    అమరావతిని ఎడారి అన్నారు

    • వైసీపీ నేతలు అమరావతిని ఎడారి అన్నారు

    • వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందారు.

  • 2025-04-14T13:13:02+05:30

    మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమం

    విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి

    మీ ఊరిని మర్చిపోవద్దు.. మీ కుటుంబాలతో పాటు ఊరిని కూడా అభివృద్ధి చేయాలని కోరిన సీఎం చంద్రబాబు

  • 2025-04-14T13:07:43+05:30

    చంద్రబాబు గ్రేట్ లీడర్- విద్యార్థులు

    • ఆయన వల్లే తాము విదేశాల్లో చదువుకుంటున్నామని తెలిపిన విద్యార్థులు

    • విద్యార్థినితో మాట్లాడిన చంద్రబాబు

  • 2025-04-14T13:04:22+05:30

    విదేశాల్లో చదువుతున్న విద్యార్థులతో చంద్రబాబు వర్చువల్ సమావేశం

    • అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం కింద విదేశాల్లో చదువుతున్న విద్యార్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ సమావేశం

    • అంబేద్కర్ విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధి పొంది కెనడాలో ఉంటున్న అనిల్, ఆస్ట్రేలియాలో ఉంటున్న స్వర్ణలతతో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన చంద్రబాబు

  • 2025-04-14T12:47:29+05:30

    రేపు సీఎల్పీ భేటీ

    • రేపు సీఎల్పీ భేటీ కానుంది.

    • దీనిలో ప్రధానంగా నాలుగు అంశాలను చర్చించనున్నారు.

    • భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు, సన్న బియ్యం అంశాలపై చర్చించనున్నారు.

  • 2025-04-14T12:47:28+05:30

    ముఖ్యమంత్రితో కేబినెట్ సబ్ కమిటీ భేటీ

    • సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశామయ్యింది.

    • ఎస్సీ వర్గీకరణ జీవోను ముఖ్యమంత్రికి అందించిన సబ్ కమిటీ.