-
-
Home » Mukhyaamshalu » Todays Breaking News Live Updates on Top Stories Latest Headlines Politics, Sports, Business and Real-Time Updates in Telugu Siva
-

Breaking News: స్పెషల్ ఫ్లైట్లో సింగపూర్కి పవన్..
ABN , First Publish Date - Apr 08 , 2025 | 09:37 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-04-08T13:00:12+05:30
స్పెషల్ ఫ్లైట్లో సింగపూర్కి పవన్..
అల్లూరి జిల్లాలో పర్యటన ముగించుకొని విశాఖ ఎయిర్పోర్టుకు పవన్.
మొదటి రోజు పెదపాడు, రెండోరోజు కురుడీ గ్రామస్థులకు ఇచ్చిన మాటపై శివాలయానికి వెళ్లి పూజలు నిర్వహించిన పవన్కల్యాణ్.
గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు రచ్చబండ.
సుంకరమెట్టలో ఉడెన్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం ముగించుకొని పయనం.
కుమారుడికి ప్రమాదం జరగడంతో ప్రత్యేక విమానంలో పవన్ పయనం.
-
2025-04-08T13:00:11+05:30
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో తీర్పుపై రాజాసింగ్ రియాక్షన్
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పుపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్.
దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 12 ఏళ్ల తరువాత తీర్పు రావడం సంతోషం.
ఎన్ఐఎ, పోలీసులకు ధన్యవాదాలు.
ఆ బాంబ్ బ్లాస్ట్ కేసులో చనిపోయిన వారంతా పేద ప్రజలు.
ఒక మతానికి చెందిన వారంతా ఈ బ్లాస్ట్లకు పాల్పడ్డారు.
చనిపోయిన వారిలో అన్ని మతాల వారు ఉన్నారు.
జిహాద్ అంటే అమాయకులను చంపడమేనా.
యాసిన్ బత్కల్ ఇంకా దొరక లేదు.
ఉరిశిక్ష కాకుండా ప్రజా కోర్ట్లో ఎన్ కౌంటర్ చేయాలని ఎన్ఐఏ వారిని కోరుతున్నాను.
ఈ మేరకు వారు అనుమతి తీసుకోవాలి.
-
2025-04-08T12:58:32+05:30
కేరళ తరహాలో అరకు అభివృద్ది..: పవన్ కల్యాణ్
కేరళ తరహాలో అరకు ప్రాంతాన్ని హోంటూరిజం పేరిట అభివృద్ధి.
కురుడి గ్రామాన్ని మోడల్ పర్యటకంగా తీర్చిదిద్దుతాం.
గ్రామ దేవతల ఆలయాలను అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తాం.
ఉపాధిహామీ పథకంలో భాగంగా ఉద్యానవన మొక్కలు అందిస్తాం.
-
2025-04-08T12:57:36+05:30
హంద్రీనీవా జాప్యానికి జగనే కారణం: మంత్రి నిమ్మల
కర్నూలు జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన.
హంద్రీనీవా ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు.
పత్తికొండ నియోజకవర్గంలో హంద్రీనీవా ప్రధాన కాల్వ పనులు పరిశీలన.
హంద్రీనీవా ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు.
బడ్జెట్లో అత్యధికంగా హంద్రీనీవాకు రూ.3,243 కోట్లు కేటాయించారు.
హంద్రీనీవా పాపానికి, జాప్యానికి రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్ కారణం.
-
2025-04-08T12:56:22+05:30
పవన్ కుమారుడికి ప్రమాదంపై స్పందించిన సీఎం చంద్రబాబు
సింగపూర్ స్కూల్లో అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడికి.. గాయాలు కావడం బాధాకరం.
మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.
-
2025-04-08T12:55:40+05:30
ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ఎన్ఐఏ స్పెషల్ పీపీ విష్ణువర్ధన్ రెడ్డి
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో తీర్పును స్వాగతిస్తున్నాం.
ఐదుగురు నిందితులకు NIA కోర్ట్ ఉరిశిక్ష విధించింది.
ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.
కోర్టులో 150 మంది సాక్షుల స్టేట్మెంట్లు ఇప్పించాం.
టెక్నికల్ ఏవిడెన్స్, సాక్షుల స్టేట్మెంట్లు కోర్టు ముందు ప్రవేశపెట్టాం.
ట్రయల్ కోర్ట్ తీర్పుపై నిందితుల వేసిన అప్పీల్ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది.
హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి 90 రోజులు ఉంటుంది.
90 రోజుల్లో అప్పీల్కు వెళ్ళకపోతే డెత్ సెంటెన్స్ను అమలు చేసే అవకాశం.
ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ పాకిస్థాన్లో తలదాచుకున్నాడు.
NIA సమర్థవంతంగా విచారణ చేసి ఆధారాలు కోర్టు ముందు పెట్టాం.
నిందితులు దిల్సుఖ్నగర్ కంటే ముందే హయత్నగర్లో ట్రయల్ బ్లాస్ట్ చేశారు.
మా వాదనలతో ఏకీభవించి ఐదుగురు నిందితుల అప్పీల్ పిటిషన్ డిస్మిస్ చేసింది.
-
2025-04-08T12:54:15+05:30
ఎమ్మెల్యే పల్లా, మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కడియం శ్రీహరి సవాల్
రెండు వేల ఎకరాల భూకబ్జా చేసినట్లు నాపై ఆరోపణలు చేస్తున్నారు.
భూకబ్జాల ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.
మీ ఇళ్లలో గులాంగిరికి సిద్ధం.. లేదంటే మా ఇంట్లో పనిచేస్తారా?
ప్రభుత్వ భూములను కాపాడే వ్యక్తిని నేను.
రైతుల భూములు కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది.
దేవునూరు గుట్టలను రక్షించాలని మంత్రి పొంగులేటిని కోరా.
-
2025-04-08T12:53:02+05:30
హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయం
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు
హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయం
సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న నిందితుల తరఫు న్యాయవాదులు
నెలరోజుల్లో సుప్రీంలో సవాల్ చేస్తామన్న నిందితుల తరఫు న్యాయవాదులు
ఇప్పటికే ట్రయల్ కోర్ట్ విధించిన ఉరిశిక్షను సమర్థించిన హైకోర్టు
NIA కోర్ట్ విధించిన తీర్పును హైకోర్టులో సవాల్ చేయగా..
నిందితుల పిటిషన్ డిస్మిస్ చేసిన న్యాయస్థానం.
-
2025-04-08T11:36:59+05:30
వంశీకి మరో షాక్..
విజయవాడ: వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ ఇచ్చింది కోర్టు.
రిమాండ్ పొడిగిస్తూ తీర్పునిచ్చింది కోర్టు.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
సత్య వర్ధన్ కిడ్నాప్ కేసుతో పాటు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
-
2025-04-08T11:34:13+05:30
డిప్యూటీసీఎం పవన్ తనయుడికి ప్రమాదం.. స్పందించిన మంత్రి లోకేష్..
-
2025-04-08T11:32:59+05:30
డిప్యూటీసీఎం పవన్ తనయుడికి ప్రమాదం.. స్పందించిన కేటీఆర్..
-
2025-04-08T11:16:26+05:30
ఢిల్లీ: తమిళనాడు గవర్నర్కి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.
గవర్నర్ల అధికారాలపై స్పష్టత ఇచ్చిన సుప్రీంకోర్టు.
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు ఎప్పటికీ నిర్ణయం తీసుకోకుండా ఉంచలేరు.
గవర్నర్ ఒకసారి తిరస్కరించిన బిల్లును అసెంబ్లీ మళ్లీ ఆమోదించిన తర్వాత, రెండవసారి అదే బిల్లును రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్కు లేదు.
తమిళనాడు ప్రభుత్వ పిటిషన్పై సుప్రీం కోర్టు తీర్పు.
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులకు గవర్నర్ ఆర్ఎన్ రవి అనుమతి ఇవ్వలేదు.
గవర్నర్ ఆర్.ఎన్. రవి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిని విచారించిన సుప్రీం ధర్మాసనం.. మంగళవారం తీర్పునిచ్చింది.
రాష్ట్ర విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకం సంబంధిత బిల్లులను కూడా గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోదించలేదు.
-
2025-04-08T11:13:14+05:30
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు శ్రవణ్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన శ్రవణ్రావు
గతంలో రెండుసార్లు విచారణకు హాజరైన శ్రవణ్రావు.
గత విచారణలో సరైన సమాధానాలు చెప్పనందున..
శ్రవణ్రావును మరోసారి విచారణకు పిలిచిన అధికారులు
శ్రవణ్రావును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు
ఎన్నికల సమయంలో వాడిన 2 సెల్ఫోన్లు ఇవ్వాలని..
శ్రవణ్రావును కోరిన సిట్ అధికారుల బృందం
ఫోన్స్ ట్యాపింగ్ చేశాక డేటా ఎవరికి పంపించారు? అని ఆరా
ఫోన్ ట్యాపింగ్కి కావాల్సిన వస్తువులు ఎవరు ఇచ్చారు? అని ఆరా
శ్రవణ్రావు కోసం 70కి పైగా ప్రశ్నలు సిద్ధం చేసిన సిట్ బృందం.
-
2025-04-08T10:38:38+05:30
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష.
ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసిన హైకోర్టు.
ఉరిశిక్ష ఖరారు చేసిన జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధ ధర్మాసనం.
నిందితులను దోషిగా తేల్చిగా హైకోర్టు.. వారు వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది.
సుమారు 45 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు.
NIA కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు.
2016 డిసెంబర్లో ఉరిశిక్ష ఖరారు చేసిన NIA కోర్టు.
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో A2 అసదుల్లా అక్తర్(యూపీ), A3 జియాఉర్ రహమాన్(పాకిస్థాన్), A4 మహమ్మద్ తహసీన్ అక్తర్ హాసన్(బిహార్), A5 మహమ్మద్ యాసిన్ భత్కల్ , A6 అజాజ్ షేక్ సమర్ అర్మాన్(మహారాష్ట్ర ).
2013లో దిల్సుఖ్నగర్లో పేలుళ్లు.
పేలుళ్లలో 18 మంది మృతి, 130 మందికి గాయాలు.
2016లో యాసిన్ భత్కల్ సహా.. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించిన NIA కోర్టు.
కింది కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించిన నిందితులు.
ఇప్పటికీ పరారీలో పేలుళ్ల కీలక దోషి రియాజ్ భత్కల్.
-
2025-04-08T09:37:54+05:30
డిప్యూటీ సీఎం పవన్ కుమారుడికి ప్రమాదం..
సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ కుమారుడికి గాయాలు.
స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకున్న పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్.
చేతులు, కాళ్ళకు గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స.
ఊపిరితిత్తుల్లోకి పొగ చేరుకోవడంతో ఇబ్బందులు.
మన్యం పర్యటన తర్వాత సింగపూర్కు వెళ్లనున్న పవన్.