Nagpur riots, Fahim Khan: నాగ్పూర్ అల్లర్ల ప్రధాన నిందితుడి ఇంటిపైకి బుల్డోజర్
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:36 AM
నాగపూర్లో జరిగిన అల్లర్లకు ప్రధాన కారణంగా భావిస్తున్న ఫహిమ్ ఖాన్ ఇంటిని మునిసిపల్ అధికారులు కూల్చివేశారు. నిబంధనలు ఉల్లంఘించిన మరో నిందితుడు యూసుఫ్ షేక్ ఇంటి పోర్షన్ను కూడా నేలమట్టం చేశారు.

నాగపూర్, మార్చి 24: మహారాష్ట్రలోని నాగపూర్ గత కొద్ది రోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న ఫహిమ్ ఖాన్ ఇంటిని స్థానిక మునిసిపల్ అధికారులు కూల్చివేశారు. ఖాన్ రెండంతస్థుల ఇంటిని సోమవారం ఉదయం బుల్డోజర్ సాయంతో నేలమట్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి నిర్మించినందునే కూల్చివేశామని అధికారులు తెలిపారు. ఇదే ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితుడు యూసుఫ్ షేక్ ఇంటి పోర్షన్ను సైతం అధికారులు కూల్చివేశారు. మహల్ ప్రాంతంలో ఉంటున్న యూసుఫ్.. నిబంధనలు అతిక్రమించి చేపట్టిన ఇంటిని కూడా నేలమట్టం చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా, భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ.. ఓ వ్యక్తి కుటుంబంపై కేసు నమోదు చేసి, వారి ఇంటిని కూల్చివేసిన ఘటనలో మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై ‘కోర్టు ధిక్కరణ’ కింద కేసు ఎందుకు పెట్ట కూడదో వివరణ ఇవ్వాలని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ
Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్
Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు
For National News And Telugu News