Bengaluru: సినిమా థియేటర్లో యాడ్స్పై కేసు
ABN , Publish Date - Feb 20 , 2025 | 05:40 AM
25 నిమిషాలకుపైగా సమయం వృథా కావడంతో ఇతర ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరు కాలేకపోయానని, దీనితో తనకు మానసిక వేదన కలిగిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్, బుక్మైషోకు జరిమానా
బెంగళూరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): సినిమా చూసేందుకు థియేటర్కు వెళితే సుదీర్ఘ వాణిజ్య ప్రకటనతో తన విలువైన సమయాన్ని వృఽథా చేశారని, అందువల్ల థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బెంగుళూరులో ఓ ప్రేక్షకుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. 25 నిమిషాలకుపైగా సమయం వృథా కావడంతో ఇతర ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరు కాలేకపోయానని, దీనితో తనకు మానసిక వేదన కలిగిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇటీవల పిటిషన్ను విచారించిన కోర్టు.. సమయాన్ని కూడా డబ్బు అంత విలువైనదిగా భావించాలని పేర్కొంది. ఇతరుల విలువైన సమయంతో లబ్ధిపొందే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. ప్రేక్షకుడికి రూ. 65 వేల పరిహారంగా చెల్లించాలని బెంగళూరులోని పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లు, బుక్మైషోకు జరిమానా విధించింది. 2023లో ‘శ్యామ్ బహద్దూర్’ అనే సినిమా చూడటానికి అభిషేక్ అనే ప్రేక్షకుడు 3 టికెట్లు బుక్ చేశాడు. అయితే 4.05 గంటల సినిమా ప్రారంభమవుతుందని ప్రకటించినా.. 4.30 వరకు యాడ్స్ కొనసాగించారు.
ఇవి కూడా చదవండి:
Anti Corruption: అవినీతిని అరికట్టేందుకు కీలక చర్యలు.. 52 మంది అధికారుల సస్పెండ్
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్టెల్కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
Read More Business News and Latest Telugu News