Share News

Delhi Exit Poll Result: ఢిల్లీ ఫలితాలపై యాక్సిస్ మై ఇండియా అంచనా ఇదే.. సునామీ సృష్టించనున్న ఆ పార్టీ

ABN , Publish Date - Feb 06 , 2025 | 08:23 PM

Delhi Exit Poll Result: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందంటూ ఇప్పటికే అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. తాజాగా యాక్సిస్ మై ఇండియా సంస్థ సైతం తన ఎగ్జిట్ పోల్ సర్వేను ప్రకటించింది.

Delhi Exit Poll Result: ఢిల్లీ ఫలితాలపై యాక్సిస్ మై ఇండియా అంచనా ఇదే.. సునామీ సృష్టించనున్న ఆ పార్టీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 06: న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తోందంటూ ఇప్పటికే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు స్పష్టం చేశాయి. తాజాగా యాక్సిస్ మై ఇండియా సైతం తన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఇదే విషయాన్ని సుస్పష్టం చేసింది. అంతేకాదు..ఈ ఎన్నికల్లో ఆ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకొంటుందని ప్రకటించింది. ఇంకా చెప్పాలంటే.. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సునామీ సృష్టిస్తోందని వెల్లడించింది. బీజేపీ 45 నుంచి 55 సీట్లు కైవసం చేసుకొంటుందని తెలిపింది.

ఇక ఓటు షేర్.. 48 శాతం ఉంటుందని పేర్కొంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి.. ఈ ఎన్నికల్లో 15 నుంచి 25 సీట్లు మధ్య వస్తాయని చెప్పింది. ఇక ఓటింగ్ షేర్ మాత్రం 42 శాతం ఉంటుందంది. ఇక మిగిలిన కాంగ్రెస్ పార్టీ మాత్రం.. ఒక్క స్థానాన్ని గెలుచుకో వచ్చు లేదా అది కూడా ఆ పార్టీకి దక్కక పోవచ్చని వివరించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు షేర్ 7 శాతమేనని ఈ సందర్భంగా యాక్సిల్ మై ఇండియా స్పష్టం చేసింది.


ఎన్నికల్ ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తే మాత్రం.. దాదాపు 26 ఏళ్ల అనంతరం ఆ పార్టీ మళ్లీ దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ వేదికగా అధికారాన్ని కైవసం చేసుకున్నట్లు అవుతోంది. అదీకాక ప్రస్తుత అధికార ఆమ్ ఆద్మీ పార్టీ.. ఓటర్ల కోసం అత్యధిక ఉచిత పథకాలు పేరుతో చాలా హామీలు గుప్పించిందని గుర్తు చేసింది. కానీ పరిపాలనా దుర్వినియోగం, అవినీతి, పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసం కావడంతో ఆప్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని పేర్కొంది.

Also Read: ఢిల్లీలో మేము ఓడిపోతాం.. గెలుపు ఆపార్టీదే.. తేల్చేసిన కాంగ్రెస్ అగ్రనేత

Also Read: క్రీడాకారులకు తీపి కబురు చెప్పిన ఏపీ ప్రభుత్వం


ఈ పరిస్థితుల్లో బీజేపీకి 52 శాతం మంది అత్యధిక మద్దతు ఈ ఎన్నికల్లో లభించిందని తెలిపింది. ఇక ఆప్‌కు 47 శాతం మద్దతు లభించగా.. అందులో 26 నుంచి 35 వయస్సు వాళ్లు అత్యధికంగా ఉన్నారని పేర్కొంది. మరోవైపు 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపును మహిళలు ప్రభావితం చేశారని సోదాహరణగా తెలిపింది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం.. ఆ మహిళలంతా బీజేపీకి మద్దతుగా నిలిచారని స్పష్టం చేసింది.

Also Read: మంత్రులకు ర్యాంకులు.. టాప్.. లాస్ట్ ఎవరంటే..?

Also Read: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి


ఫిబ్రవరి 5వ తేదీన జరిగిన ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. కానీ కేకే సర్వే మాత్రం ఆప్ విజయం సాధిస్తుందని తన సర్వే నివేదికలో వెల్లడించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన వెలువడనున్నాయి. దీంతో ఢిల్లీ ఓటరు ఏ పార్టీ పట్టం కట్టినది ఆ రోజు స్పష్టం కానుంది.

Also Read: విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు

Also Read: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత

For National News And Telugu News

Updated Date - Feb 06 , 2025 | 08:24 PM