Share News

Rubis Assalts: పైరేట్ల చెరలో ఏడుగురు భారతీయులు

ABN , Publish Date - Mar 26 , 2025 | 03:55 AM

పశ్చిమ ఆఫ్రికా తీరంలో సముద్రపు దొంగలు ఏడుగురు భారతీయులను కిడ్నాప్‌ చేశారు. ఈ సంఘటన లోకం రూమ్‌కు సంబంధించిన ‘బిటుమెన్‌ రివర్‌’ నౌకలో జరిగింది, గిరఫ్లను తమ అదుపులోకి తీసుకున్న సముద్ర దొంగలు తర్వాత నౌక నుంచి దిగిపోయారని సంస్థ పేర్కొంది.

Rubis Assalts: పైరేట్ల చెరలో ఏడుగురు భారతీయులు

  • పశ్చిమ ఆఫ్రికా తీరంలో నౌకలోకి చొరబడి కిడ్నాప్‌

న్యూఢిల్లీ, మార్చి 25: పశ్చిమ ఆఫ్రికా తీరంలో ఏడుగురు భారతీయులను సముద్రపు దొంగలు(పైరేట్లు) కిడ్నాప్‌ చేశారు. కామెరూన్‌లోని డౌలాకు వెళ్లే మార్గంలో ‘బిటుమెన్‌ రివర్‌’ అనే నౌకలో నావికులుగా ఉన్న వీరిని సముద్రపు దొంగలు అదుపులోకి తీసుకున్నారు. పనామాకు చెందిన ఈ నౌకను రూబిస్‌ అసాల్ట్స్‌ అనే సంస్థ నిర్వహిస్తోంది. కిడ్నాప్‌ అయిన వారిలో తమిళనాడులోని తేనీకి చెందిన లక్ష్మణ్‌ ప్రదీప్‌ మురుగన్‌, కరూర్‌కు చెందిన సతీశ్‌ కుమార్‌ సెల్వరాజ్‌, కేరళకు చెందిన రాజేంద్రన్‌ భార్గవన్‌, బిహార్‌కు చెందిన సందీప్‌ కుమార్‌ సింగ్‌తోపాటు రొమేనియాలో ఉంటున్న ముగ్గురు భారతీయులు ఉన్నారు. భద్రతా నివేదికల ప్రకారం ముగ్గురు వ్యక్తులు నౌకలోకి ఎక్కి కాల్పులు జరిపారని తెలిసింది. అయితే సముద్రపు దొంగలు నౌక నుంచి దిగిపోయారని రూబిస్‌ అసాల్ట్స్‌ సంస్థ సెక్యూరిటీ ఆఫీసర్‌ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

Bad Luck to Shreyas Iyer: అయ్యర్‌కు అదృష్టాన్ని దూరం చేసిన శశాంక్.. ఏడుపొక్కటే తక్కువ


IPL 2025: నువ్వు మారవా..ఐపీఎల్‌ వదిలేసి పల్లీ బఠాణీలు అమ్ముకో, స్టార్ ఆటగాడిపై ట్రోల్స్..


IPL 2025: పంజాబ్ సూపర్ కింగ్స్‌లో పవర్‌ఫుల్ హిట్టర్ల లిస్ట్ చుశారా..

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 26 , 2025 | 03:55 AM