Shashi Tharoor: కేంద్ర మంత్రి గోయల్తో శశి థరూర్ సెల్ఫీ
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:18 AM
యూకే-భారత్ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన చర్చ సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి గోయల్, బ్రిటన్ ట్రేడ్ సెక్రటరీ జోనాథన్ రోనాల్డ్స్లతో కలిసి దిగిన ఓ సెల్ఫీని థరూర్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సెల్ఫీ దిగారు. దాంతో థరూర్ కాంగ్రె్సను వీడనున్నారని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరింది. యూకే-భారత్ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన చర్చ సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి గోయల్, బ్రిటన్ ట్రేడ్ సెక్రటరీ జోనాథన్ రోనాల్డ్స్లతో కలిసి దిగిన ఓ సెల్ఫీని థరూర్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో ఆయనకు విభేధాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఇంటర్య్యూలో మాట్లాడుతూ.. కాం గ్రెస్ తనను వద్దనుకుంటే తనకూ ప్రత్యామ్నాయాలు ఉన్నాయని శశి థరూర్ తేల్చిచెప్పారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు
Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు
Also Read : అసోం బిజినెస్ సమ్మిట్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ
For National News And Telugu News