MLC Nagababu: సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ నాగబాబు
ABN, Publish Date - Apr 03 , 2025 | 07:07 AM
శాసనమండలి ఛైర్మన్ కార్యాలయంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఎమ్మెల్సీ నాగబాబు సచివాలయంలో మర్యాదపూర్వకరంగా కలిశారు.

శాసనమండలి ఛైర్మన్ కార్యాలయంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఎమ్మెల్సీ నాగబాబు, ఆయన సతీమణి పద్మజ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకరంగా కలిశారు.

ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుని చంద్రబాబు నాయుడుని కలిసి శాలువాతో సత్కరించిన అనంతరం బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాగబాబును శాలువాతో సత్కరించి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు.

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు శాసన మండలి సభ్యునిగా బుధవారం శాసన మండలి చైర్మన్ సమక్షంలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.

గత మార్చి నెలలో జరిగిన శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా పోటీకి దిగిన నాగబాబు శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సూచనలకు అనుగుణంగా బుధవారం శాసన మండలిలో నాగబాబు ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.

ఎమ్మెల్సీ నాగబాబుకు శుభాకాంక్షలు చెబుతున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, తదితరులు

శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజుకు పుష్పగుచ్చం అందజేస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు

ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపడుతున్న నాగబాబు
Updated at - Apr 03 , 2025 | 07:09 AM