మహిళల ముక్కోణపు సిరీస్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:15 AM
ఎన్నికల కారణంగా మహిళల ముక్కోణపు వన్డే సిరీస్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆతిథ్య లంకతోపాటు భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఈ సిరీ్సలో ఆడనున్నాయి...

కొలంబో: ఎన్నికల కారణంగా మహిళల ముక్కోణపు వన్డే సిరీస్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆతిథ్య లంకతోపాటు భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఈ సిరీ్సలో ఆడనున్నాయి. గతంలో మే 1, 4, 6, 8 తేదీల్లో షెడ్యూల్ చేసిన మ్యాచ్లను మే 2, 4, 7, 9 తేదీలకు మార్చారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ప్రేమదాస స్టేడియంలో మే 6న జరగాల్సిన మ్యాచ్ ఆ తర్వాతి రోజు అంటే 7వ తేదీ జరగనుంది. ముక్కోణపు సిరీస్ ఏప్రిల్ 27న శ్రీలంక-భారత్ మ్యాచ్తో మొదలవనుండగా.. 29న భారత్-దక్షిణాఫ్రికా, మే 2న శ్రీలంక-దక్షిణాఫ్రికా, 4న శ్రీలంక-భారత్, 7న భారత్-దక్షిణాఫ్రికా, 9న శ్రీలంక-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. మే 11న ఫైనల్ మ్యాచ్ను షెడ్యూల్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Dhanashree-Ritika: ఛాహల్ మాజీ భార్యపై జర్నలిస్ట్ విమర్శ.. లైక్ కొట్టిన రోహిత్ భార్య రితిక
Vignesh puthur: విఘ్నేష్ పుత్తుర్.. ఆటో డ్రైవర్ కొడుకుతో ధోనీ ఏం మాట్లాడాడంటే..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..