బార్ అసోసియేషన అధ్యక్షుడిగా అనంతరెడ్డి
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:41 AM
బార్ అసోసియేషన నల్లగొండ జిల్లా కా ర్యవర్గం ఎన్నికలు హోరాహోరీగా సాగాయి.

బార్ అసోసియేషన అధ్యక్షుడిగా అనంతరెడ్డి
నల్లగొండ క్రైం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): బార్ అసోసియేషన నల్లగొండ జిల్లా కా ర్యవర్గం ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. నల్లగొండ జి ల్లా కోర్టులో శుక్రవారం నిర్వహించిన బార్ అసోసియేషన ఎన్నికల్లో అధ్యక్షుడిగా క ట్టా అనంతరెడ్డి ప్రత్యర్థి సతీ ష్పై 16 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా మంద నగేష్ ఆ యన ప్రత్యర్థి ఎస్పీ ప్రవీణ్పై 22 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అదే విధంగా ఉపాధ్యక్షుడిగా ఎం.నాగిరెడ్డి, పెరుమాళ్ల శేఖర్, జాయింట్ సెక్రటరీగా ఎండీ.ఫెరోజ్, కోశాధికారిగా బరిగెల నగేష్, గేమ్స్ సెక్రటరీగా గోసుల నాగార్జున శివప్రసాద్, కల్చరల్ సెక్రటరీగా వెంకన్న బొమ్మరగాని, లైబ్రరీ సెక్రటరీగా బి.మధుతో పాటు ఈసీ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజును నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్టా అ నంతరెడ్డి, మంద నగేష్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి త మవంతు కృషి చేస్తామన్నారు. ఎన్నికల ప్రధాన అధికారిగా గుండె వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఎన్నికల అధికారులుగా సయ్యద్ జమీల్, వెంకట్రెడ్డి వ్యవహరించారు.