Bhatti Vikramarka: పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి
ABN , Publish Date - Apr 05 , 2025 | 04:00 AM
తమ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఉద్యోగుల ఐకాస విజ్ఞప్తి చేసింది.

ఉప ముఖ్యమంత్రి భట్టికి ఉద్యోగుల ఐకాస వినతి
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): తమ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఉద్యోగుల ఐకాస విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐకాస చైర్మన్ వి. లచ్చిరెడ్డితో కలిసి ఆ సంఘం నేతలు ప్రజాభవన్లో శుక్రవారం మంత్రికి వినతిపత్రం అందజేశారు. అనంతరం తమ సమస్యలను మంత్రికి వివరించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయడంతోపాటు, తాత్కాలిక ఉద్యోగుల బకాయిలను కూడా విడుదల చేయాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఐకాస నేతలు తెలిపారు.