Share News

Hyderabad: ఊరికి పోదాం చలోచలో

ABN , Publish Date - Mar 30 , 2025 | 02:08 AM

బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి బయలుదేరుతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ నుంచి శనివారం రాత్రి వందకు పైగా అదనపు బస్సులను వేశామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.

Hyderabad: ఊరికి పోదాం చలోచలో

  • వరుస సెలవులతో సొంతూళ్లుకు హైదరబాద్‌ వాసులు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ఉగాది, రంజాన్‌ పండుగలతో వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో హైదరాబాద్‌ వాసులు సొంతూళ్లకు వెళుతున్నారు. ఆదివారం ఉగాది, సోమ, మంగళవారాలు రంజాన్‌ పండగతో పాఠశాలలు, కళాశాలలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలువులు కావడంతో వేలమంది స్వగ్రామాలకు పయనమవుతున్నారు. దీంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్‌(జేబీఎస్‌), మహాత్మా గాంధీ బస్టాండ్‌(ఎంజీబీఎస్‌) కిటకిటలాడుతున్నాయి.


బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి బయలుదేరుతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ నుంచి శనివారం రాత్రి వందకు పైగా అదనపు బస్సులను వేశామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, గోదావరిఖని, నల్లగొండ ప్రాంతాలతోపాటు పలు జిల్లాలకు ఈ అదనపు బస్సులు వేసినట్లు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..

GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 30 , 2025 | 02:08 AM