ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు షెడ్లు ఏర్పాటు
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:02 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు షెడ్లు ఏర్పాటు చేసేందుకు నాయకులు, అధికారులు ప్రణాళిక తయారు చేశారు.

- మార్చురీ గది, వాటర్ ప్లాంట్, వెయిటింగ్ హాల్కు ప్రణాళిక
కోస్గి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు షెడ్లు ఏర్పాటు చేసేందుకు నాయకులు, అధికారులు ప్రణాళిక తయారు చేశారు. మంగళవారం పీఆర్ ఏఈ అంజిరెడ్డి, వైద్యశాఖ జిల్లా సూపరింటెండెంట్ మల్లికార్జున్ తో కలిసి నాయకులు ప్రణాళిక తయారు చేశారు. వారం క్రితం కూల్చిన ఆసుపత్రి పాత భవ నం స్థానంలో మార్చురీ గది, పేషెంట్ వెయిటింగ్ హాల్కు ప్రణాళిక తయారు చేశారు. అదే విధంగా వాటర్ ప్లాంట్కు కూడా ప్రణాళిక వేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ అధ్యక్షుడు బెజ్జురాములు సోమవారం ఆసుపత్రిలో జరిగిన ఘటనపై జిల్లా సూపరింటెండెంట్ మల్లికార్జున్ను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు భానునాయక్, బాలేష్ ఉన్నారు.