Share News

నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:44 PM

చేనేత సహకార ఉత్పత్తి సంఘానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి చేనేత కార్మికులను ఆదుకోవాలని దోత్రె శ్రీ నివాసులు అన్నారు.

నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

రాజోలి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): చేనేత సహకార ఉత్పత్తి సంఘానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి చేనేత కార్మికులను ఆదుకోవాలని, లేదంటే చేనేత సహకార సంఘాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని రాజోలి చేనే త సహకార సంఘం పర్సన్‌ ఇన్‌చార్జి దోత్రె శ్రీ నివాసులు అన్నారు. రాజోలిలోని చేనేత సహకార సంఘంలో శుక్రవారం సంఘం ఇన్‌చార్జి మేనేజర్‌ అంపయ్య ఆధ్వర్యంలో సర్వసభ్య స మావేశం నిర్వహించారు. ఈసందర్బంగా దోత్రె శ్రీనివాసులు మాట్లాడారు. చరిత్ర గల రాజోలి చేనేత సహకార సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పర్సన్‌ ఇంచార్జ్‌లు మాబూ, మహేశ్వరమ్మ, మల్లమ్మ, నందవరంబాబు, నాగరాజు, చేనేత సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:44 PM