Share News

పురస్కారాలు అందుకున్న పేట మహిళలు

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:16 PM

వివిధ రంగాల్లో సేవలందించిన పేట జిల్లా కేంద్రానికి చెందిన మహిళలు పురస్కారాలు అందుకున్నారు.

పురస్కారాలు అందుకున్న పేట మహిళలు
అవార్డులు అందుకున్న పేట జిల్లా మహిళలు

నారాయణపేట, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): వివిధ రంగాల్లో సేవలందించిన పేట జిల్లా కేంద్రానికి చెందిన మహిళలు పురస్కారాలు అందుకు న్నారు. హైదరాబాద్‌లోని సం కల్ప ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివారం జేఎన్టీయూ కళాశాలలో నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన రోహిణి లాహోటి మెకానిజంలో, బి.పద్మ సామాజిక సేవలో, బాలమణి చేనేత రంగంలో అందించిన సేవలకు జ్ఞాపిక, ప్రశంసాపత్రాలతో అవార్డులు అందించారు. ఈ సందర్భంగా రిటైర్డ్‌ న్యాయాధికారి ఇందుమతి, ప్రొఫెసర్‌ సురేఖలు మాట్లాడుతూ సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. స్వశక్తితో, స్వయం ఉపాధితో ఎదిగి సమాజ సేవకు ఆదర్శం కావాలన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 11:16 PM